DailyDose

భారత్ లో కొత్తగా 9923 కరోనా కేసులు 17 మరణాలు నమోదు.

భారత్ లో కొత్తగా 9923 కరోనా కేసులు 17 మరణాలు నమోదు.

మన దేశంలో కరోనా ఫోర్త్ వేవ్ విలయతాండవం చేస్తోంది. మొన్నటి వరకు భారీగా తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు..మళ్ళీ పుంజుకున్నాయి. అయితే తాజాగా నిన్నటి కంటే ఎక్కువగానే ఇవ్వాళ కరోనా కేసులు నమోదు అయ్యాయి.కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 9923 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,33,19,396 కు చేరింది.ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 79,313 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 99.22 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 17 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 5,24,890 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 7293 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 4,27,15,193 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,96,32,43,003 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 13,00,024 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ.