NRI-NRT

మోడీని గద్దె దించాలంటే కెసిఆర్ గారి తోనే సాధ్యం – మహేష్ బిగాల

మోడీని గద్దె దించాలంటే కెసిఆర్ గారి  తోనే సాధ్యం –   మహేష్ బిగాల

కెసిఆర్ గ తలపెట్టిన భారతీయ రాష్ట్ర సమితి పార్టీ కి మద్దతు కొరకు యూరోప్ పర్యటనలో ఉన్న టీఆరెస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల ఆస్ట్రియా లో ఎన్నారై లతో సమావేశమయ్యారు. మహేష్ మాట్లాడుతూ ఎన్నారైలలో బిఆర్ఎస్ పైన విశేష స్పందన లభిస్తుందని అన్నారు ముఖ్యంగా ఉత్తర భారత ఎన్నారైల నుండి అద్భుత మద్దతు లభిస్తున్నది అన్నారు. దేశంలో ప్రత్యాన్మయా పార్టీ కి ఆవశ్యకత ఉందన్నారు. తెలంగాణ లోని సంక్షేమ పథకాలు దేశమంతా విస్తరించాలన్నారు. కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్స్ ప్రతి రాష్ట్రం లో కట్టాలన్నారు. మిషన్ భగీరథలాగా ప్రతి రాష్ట్రం లో ఇంటిటికి తాగు నీరు రావాలన్నారు. మోడీ ని ఎదురుకొనే శక్తి ఒక్క కెసిఆర్ గారికే ఉన్నదని ఉత్తర భారత ఎన్నారైలు భావిస్తున్నారని అన్నారు మోడీని గద్దె దించడం కెసిఆర్ తోనే సాధ్యమని ఎన్నారైలు అన్నారన్నారు. తెలంగాణాలో ఐ టి ఇండస్ట్రీ బాగా అభివృద్ధి చెందింది అని అన్నారు. కేటిఆర్ లాంటి మంత్రి అన్ని రాష్టాలకు అవసరమని అన్నారు. ఉత్తర భారత ఎన్నారైలు కెసిఆర్ గారితో జూమ్ మీటింగ్ పెట్టమని కోరారు. బిఆర్ఎస్ పైన దిశా నిర్దేశం చేయాలనీ కోరారు. మోడీ గ్రాఫ్ పడిపోయిదని కాంగ్రెస్ కి ఫ్యూచర్ లేదని ఎన్నారైలు అన్నారు. కొత్త పార్టీ పెట్టడానికి ఇదే మంచి తరుణమని అన్నారు. ఈ కారక్రమంలో టీఆరెస్ ఆస్ట్రియా కార్యవర్గం మరియు వివిధ రాష్ట్ర ఎన్నారైలు పాల్గొన్నారు. వీరిలో అనుమాండ్ల లక్ష్మరెడ్డి, బొల్లాడి లక్ష్మరెడ్డి, సంతోష్, కంది వంశీ, కోరండ్ల ప్రవీణ్, రంగు మహేష్, దోర్నాల సంతోష్, శ్రీనివాసరావు, రమేష్, శ్రీనివాస్, అశోక్, భరత్, సత్యజిత్, రూపేష్ స్వాల్ మరియు ఇతరులు పాల్గొన్నారు. త్వరలోనే టీఆరెస్ ఆస్ట్రియా కొత్త కార్యవర్గం ప్రకటిస్తామన్నారు.
IMG-20220627-WA0123
image hosting