ఉత్తర అమెరికా తెలుగు సంఘo ’తానా’ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “తానా పాఠశాల” న్యూయార్క్ నగర విభాగo ‘పాఠశాల వార్షికోత్సవం’ ఆదివారం మే 26వ తేదీ సంకెన్ మెడో పార్కులో ఘనంగా జరిగింది. దాదాపు 100 మంది పిల్లలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఆహుతులు పాల్గొన్న ఈ వార్షికోత్సవ కార్యక్రమం ఆద్యంతం ఆహ్లాదకరంగా, కోలాహలంగా, ఉల్లాసంగా సాగింది. తానా సంస్థ న్యూయార్క్ RVP దిలీప్ కుమార్ ముసునూరు, పాఠశాల న్యూయార్క్ నగర ప్రధాన నిర్వాహకురాలు, ఉపాధ్యాయులు శ్రీమతి కృష్ణవేణి కొండమడుగుల, హేమలత బొర్రా, లాస్య రెడ్డి మరద మరియు రమ్యప్రభ బొందలపాటి నిర్వహణలో సాగిన ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది.