Movies

తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్న సినీ న‌టి రాశీ ఖ‌న్నా

తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్న సినీ న‌టి రాశీ ఖ‌న్నా

సినీ న‌టి రాశీ ఖన్నా తిరుమ‌ల శ్రీవారిని బుధ‌వారం ఉద‌యం ద‌ర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు. ఆమె వీఐపీ ద‌ర్శ‌న స‌మ‌యంలో స్వామి వారి సేవ‌లో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు ఆమెకు స్వాగ‌తం ప‌లికి ద‌ర్శ‌న ఏర్పాట్లు చేశారు. ద‌ర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు.. వేదాశీర్వచనం చేసి… శ్రీవారి లడ్డు ప్రసాదాలను అందజేశారు. గోపిచంద్ న‌టుడిగా తెర‌కెక్కిన ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ సినిమా విజ‌య‌వంతం కావాల‌ని శ్రీవారిని ప్రార్థించిన‌ట్లు రాశీ ఖ‌న్నా పేర్కొన్నారు.