Movies

పోలీసులను ఆశ్రయించిన సీనియర్​ నటి పవిత్ర

పోలీసులను ఆశ్రయించిన సీనియర్​ నటి పవిత్ర

సీనియర్ నటి పవిత్రా లోకేష్​.. సైబర్​ పోలీసులను ఆశ్రయించారు. కొందరు సోషల్​మీడియాలో తన గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రాల్లో ఎన్నో పాత్రలతో మెప్పించిన సీనియర్​ నటి పవిత్రా లోకేష్​. ఈ మధ్యకాలంలో సోషల్​మీడియాలో ఆమె వ్యక్తిగత జీవితంపై రూమర్స్​ విపరీతంగా వస్తున్నాయి. ఆమె సీనియర్​ నటుడు నరేశ్​ను​ పెళ్లి చేసుకోబోతుందంటూ కథనాలు వస్తున్నాయి.ఈ నేపథ్యంలో పవిత్ర.. కర్ణాటకలోని సైబర్​ పోలీసులను ఆశ్రయించారు. కొందరు తన పేరుతో ఫేక్​ అకౌంట్స్​ను క్రియేట్​ చేసి, అసభ్యకరమైన పోస్ట్​లు పెడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. లేనిపోని పుకార్లు పుట్టించి తన పేరుని చెడగొడుతున్నారని వాపోయారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. కాగా, సినీ నేప‌థ్య కుటుంబం నుంచి వచ్చారు పవిత్రా లోకేష్​. ఈమె తండ్రి, ప్ర‌ముఖ న‌టుడు మైసూర్ లోకేష్‌. భ‌ర్త సుచేంద్ర ప్ర‌సాద్‌, సోదరుడు ఆది లోకేష్ కూడా క‌న్న‌డ‌లో న‌టులు. ప్రస్తుతం తెలుగులో పలువురు స్టార్​ హీరోలకు తల్లిగా నటిస్తున్న ఆమె.. కొంతకాలం క్రితం తన భర్త నుంచి విడిపోయి దూరంగా ఉంటున్నారు.