Movies

అందుకే ఈ మౌనం..!

అందుకే ఈ మౌనం..!

అగ్ర కథానాయిక కియారా అద్వాణీ బ్రేకప్‌ లవ్‌ స్టోరీ ఇప్పుడు బాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. ‘షేర్షా’ చిత్రంలో తన సహనటుడు సిద్ధార్థ మల్హోత్రాతో ఈ భామ గత కొంతకాలంగా ప్రేమాయణం నడుపుతున్నది. ఈ మధ్యనే ఈ జంట విడిపోయారని ముంబయి మీడియాలో వార్తలొచ్చాయి. వీటిపై ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసింది కియారా అద్వాణీ. ఇటీవల ఓ జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ‘నా ప్రేమ వ్యవహారం గురించి బాహాటంగా మాట్లాడటం ఇష్టం లేదు. ని భయంగా ఉంది. సమయం వచ్చినప్పుడు ఈ విషయం గురించి తప్పకుండా మాట్లాడతా. అందరూ అనుకున్నట్లుగా నా వ్యక్తిగత జీవితంలో ఎలాంటి సంక్షోభం లేదు. అంతా సవ్యంగా సాగిపోతున్నది. వృత్తిపరంగా కూడా ప్రస్తుతం ఉన్నత స్థితిలో ఉన్నా. నిరాధారణమైన వార్తలతో నా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయలేరు’ అని చెప్పింది. ప్రస్తుతం ఈ భామ తెలుగులో రామ్‌చరణ్‌-శంకర్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రంలో కథానాయికగా నటిస్తున్నది.