NRI-NRT

“ఆటా” రెండోరోజు సాయంత్రం విశేషాలు

“ఆటా” రెండోరోజు సాయంత్రం విశేషాలు

17వ ఆటా మహాసభల రెండోరోజు సాయంకాల కార్యక్రమానికి ప్రవాస అతిథులు భారీగా తరలివచ్చారు. సాయంకాల కార్యక్రమాన్ని కామినేని ఉపాసన తన ప్రసంగంతో ప్రారంభించారు. జన్మభూమి అభివృద్ధిలో, ఆరోగ్యపరమైన సేవా కార్యక్రమాల నిర్వహణలో భాగస్వామ్యులు కావాలని కోరారు. అనంతరం సద్గురు ప్రసంగించారు. వాతావరణ మార్పుల కారణంగా సంభవించే నష్టాలను నిర్వహించడానికి మట్టిని జాగ్రత్తగా కాపాడుకోవాలని, మనస్సును కూడా శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఆటా ఆధ్వర్యంలో డీసీలో ప్రవాస తెలుగువారితో కలిసే అవకాశం కల్పించినందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తెరాస ఎమ్మెల్సీ కవిత, మంత్రులు ఎర్రబెల్లి, నిరంజన్‌రెడ్డి, సినీతారలు రకుల్, అడివి శేష్, గాయని మంగ్లీ, యాంకర్ రవి తదితరులు పాల్గొన్నారు. తమన్ సంగీత విభావరి అలరించింది.