NRI-NRT

కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లోకి రావాలి: ఎన్నారైలు

కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లోకి రావాలి: ఎన్నారైలు

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జాతీయ రాజకీయాల్లోకి రావాలని ఎన్నారైలు నినదించారు. ఆటా (అమెరిక‌న్ తెలుగు అసోసియేష‌న్‌) మహాసభలకు హాజరైన సందర్భంగా టీఆర్‌ఎస్‌ యూఎస్‌ఏ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత, మంత్రులు, ఎమ్మెల్యేలతో ‘మీట్‌ అండ్‌ గ్రీట్‌’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ యూఎస్‌ఏ విభాగం తరఫున వారికి నరసింహ ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎన్నారై కో ఆర్డినేటర్‌ మహేశ్‌ బిగాల మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ శాఖల పనితీరును వివరించారు. ప్రపంచవ్యాప్తంగా 50కిపైగా దేశాల్లో శాఖలున్న ఏకైక పార్టీ టీఆర్‌ఎస్‌ అన్నారు. దేశ రాజకీయాల్లో కేసీఆర్‌ నాయకత్వం అవసరమని ఎన్నారైలంతా కోరుకుంటున్నారని తెలిపారు.
TRS-NRI-02
కార్పొరేట్లకు తొత్తుగా బీజేపీ ప్రభుత్వం : కవిత
కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్‌ సంస్థలకు తొత్తుగా వ్యవహరిస్తుందని విమర్శించారు. ప్రధాని మోదీ ప్రభుత్వరంగ సంస్థలను తన స్నేహితుడు అదానీకి కట్టబెడుతున్నారని, అసలు దేశానికి ప్రధానిగా మోదీ ఉన్నారా? అదానీ ఉన్నారా? అనే అనుమానం కలుగుతుందన్నారు. రైతులు, పేదలు రెండు కండ్లుగా సంక్షేమ పాలన అందిస్తూ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్‌ వన్‌గా నిలిపిన దార్శనికుడు కేసీఆర్‌ అని అన్నారు.ప్రస్తుతం దేశానికి రోల్‌ మోడల్‌గా తెలంగాణ ఆవిర్భవించిందని చెప్పారు. తెలంగాణలో ప్రస్తుతం కరెంట్‌ కోతలు లేవని, తాగునీటి వెతలు లేవని, వలసలు అసలే లేవని తెలిపారు. దేశానికి పన్నుల రూపంలో అత్యధిక వాటా తెలంగాణ ఇస్తున్నదని గుర్తుచేశారు. బీజేపీకి ఒక విధానం, నినాదం లేదని.. కేవలం విద్వేశాలను రెచ్చగొట్టమే వాళ్ల ఎజెండా అని విమర్శించారు. కశ్మీర్‌లో మత రాజకీయం అన్నిచోట్లా విద్వేష రాజకీయాలు చేస్తున్నదని మండిపడ్డారు.
TRS-NRI-01
url img net
బీజేపీ పాలనలో తెలంగాణకు ఒరిగిందేమీ లేదు
ఆరు దశాబ్దాలుగా దేశాన్ని నాశనం చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం దిక్కు లేకుండాపోయిందన్నారు. దేశాన్ని గడిచిన ఎనిమిదేండ్లుగా సాగుతున్న మోదీ పాలనలో దారిద్య్రం మరింత పెరిగి పోయిందని విమర్శించారు. బీజేపీ పాలనలో తెలంగాణకు పెద్దగా ఒరిగిన ప్రయోజనం ఏమీ లేదన్నారు. యావత్ భారత్‌ ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటుందన్నారు. ఈ సందర్భంగా జై భారత్ , జై కేసీఆర్ , జై తెలంగాణ నినాదాలతో కార్యక్రమం మార్మోగింది. ఈ సందర్భంగా కేసీఆర్‌ నాయకత్వం దేశానికి అవసరమంటూ సంపూర్ణ మద్దతు తెలిపారు.అలాగే అమెరికా టీఆర్‌ఎస్‌తో పాటు వివిధ దేశాల్లో ఉన్న టీఆర్‌ఎస్‌ శాఖలు వారివారి వృత్తులను కొనసాగిస్తూనే అన్నిరకాల మద్దతు ఇస్తున్నారంటూ కవిత ప్రశంసించారు. ఆట సభలకు హాజరైన టీఆర్‌ఎస్‌ బృందానికి అన్ని రకాల ఏర్పాటు చేసినందుకు యూఎస్‌ఏ శాఖను అభినందించారు. కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, చామ‌కూర మ‌ల్లారెడ్డి, ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, గాద‌రి కిశోర్‌, చ‌ల్లా ధ‌ర్మారెడ్డి, గువ్వల బాలరాజు, క్రాంతి కిర‌ణ్‌, బొల్లం మల్లయ్య, టీఎస్‌ఐఐసీ చైర్మన్‌ గాదరి బాలమల్లు, యూఎస్‌ఏ టీఆర్‌ఎస్‌ సభ్యులు పూర్ణ బైరి, నరసింహారావు నాగులవంచా, అనిల్ ఎర్రబెల్లి, రవి దన్నపనేని, సక్రు నాయక్, నవీన్ జలగం, జాగృతి సభ్యులు పాల్గొన్నారు.