DailyDose

రేపు పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ రెండో పెళ్లి

రేపు  పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ రెండో పెళ్లి

పంజాబ్‌ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) నేత భగవంత్‌ మాన్‌ సింగ్‌ గురువారం పెళ్లి చేసుకోనున్నారు. డాక్టర్‌ గురుప్రీత్‌ కౌర్‌తో రెండో వివాహం జరుగనున్నది. చండీగఢ్‌లోని ఆయన నివాసంలో జరుగనున్న ఈ ప్రైవేట్‌ వేడుకకు ఆప్‌ చీఫ్‌, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ హాజరుకానున్నారు.కాగా, సీఎం భగవంత్‌ మాన్‌ సింగ్‌కు ఇది వరకు ఇందర్‌ప్రీత్ కౌర్‌తో పెళ్లయింది. 2014లో ఆయన ఎంపీగా పోటీ చేసినప్పుడు ఎన్నికల ప్రచారంలో కూడా ఆమె పాల్గొన్నారు. అయితే ఆరేళ్ల వివాహ బంధం తర్వాత మొదటి భార్య ఇందర్‌పీత్ర్‌ కౌర్‌, ఆయన విడిపోయారు. భగవంత్‌ మాన్‌కు తొలి భార్య ద్వారా ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారు ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నారు.పంజాబ్‌ ఎన్నికల్లో ఆప్‌ అనూహ్యంగా విజయం సాధించింది. దీంతో భగవంత్‌ మాస్ సింగ్‌ సీఎం అయ్యారు. మరోవైపు ఆయన మరో పెళ్లి చేసుకోవాలని తల్లి, సోదరి సూచించారు. వారిద్దరికి తెలిసిన వైద్యురాలు గురుప్రీత్‌ కౌర్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తున్నది. దీంతో గురువారం చండీగఢ్‌లోని భగవంత్‌ మాన్‌ సింగ్‌ నివాసంలో గురుప్రీత్‌ కౌర్‌తో ఆయన రెండో పెళ్లి అత్యంత సన్నిహితుల సమక్షంలో ప్రైవేటుగా జరుగనున్నది.