DailyDose

భారత్ లో కొత్తగా 20557 కరోనా కేసులు నమోదు

Auto Draft

ఇండియాలో కరోనా ఫోర్త్ వేవ్ విలయతాండవం చేస్తోంది. మొన్నటి వరకు భారీగా తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు..మళ్ళీ పుంజుకున్నాయి. అయితే తాజాగా నిన్నటి కంటే ఎక్కువ గానే ఇవ్వాళ కరోనా కేసులు నమోదు అయ్యాయి.కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 20557 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,38,03,889 కు చేరింది. ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 1,43,091 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 96.98 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 2603 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 5,28,388 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 16113 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 4,31, 3623 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 2,00,61,24,684మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 26,04,797 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ.