ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో ఉన్న పాలరాతి కట్టడం తాజ్మహల్ను విజిట్ చేస్తున్న విదేశీ టూరిస్టు సంఖ్య గతంతో పోలిస్తే తగ్గింది. కానీ దేశంలోని అద్భుత కట్టడాల్లో అత్యధిక టూరిస్టులను ఆకర్షిస్తున్నది తాజ్మహలే. ఈ ఏడాది ఇప్పటికే టూరిస్టుల ద్వారా తాజ్కు రూ.25 కోట్ల ఆదాయం వచ్చింది. వాస్తవానికి 2020తో పోలిస్తే ఆదాయం 73 శాతం పడిపోయింది. కోవిడ్ ఆంక్షల వల్ల ఆ ఆదాయం తగ్గింది. ఢిల్లీలోని ఎర్రకోటతో పోలిస్తే అయిదు రేట్లు అధికంగా తాజ్ ఆదాయం ఉంది. తమిళనాడులోని మామల్లపురం, భువనేశ్వర్లోని సూర్యదేవాలయంతో పోలిస్తే తాజ్ ఆదాయం పది రేట్లు ఎక్కువగా ఉంది.