Movies

మంచు ఇంటి నుంచి.. మూడో తరం

మంచు ఇంటి నుంచి.. మూడో తరం

మంచు మోహన్‌బాబు నటుడిగా, నిర్మాతగా తెలుగు చిత్రసీమలో తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకొన్నారు. ఆయన వారసులుగా వచ్చిన విష్ణు, మనోజ్‌, లక్ష్మిలు కూడా తమ సత్తా చూపించారు. ఇప్పుడు మూడో తరం కూడా వచ్చేసింది. విష్ణు కుమార్తెలు అరియానా, వివియానా ఇప్పుడు సింగర్స్‌ అవతారం ఎత్తారు. విష్ణు కథానాయకుడిగా ‘జిన్నా’ అనే చిత్రం రూపొందుతోంది. ఇందులో ‘ఇదే స్నేహం’ అనే పాటని ఈ కవల సోదరీమణులిద్దరూ ఆలపించారు. అనూప్‌ రూబెన్స్‌ స్వరపరిచిన ఈ గీతాన్ని భాస్కరభట్ల రచించారు. ఈ సందర్భంగా ఎం.ఎం.కీరవాణి, కోటి, దేవిశ్రీ ప్రసాద్‌, తమన్‌, అచ్చు, మనో, గీతా మాధురి వీరికి ‘ఆల్‌ ది బెస్ట్‌’ చెప్పారు. ఇషాన్‌ సూర్య దర్శకత్వం వహించిన చిత్రమిది. జి.నాగేశ్వరరెడ్డి కథ అందించారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది.