Movies

సూపర్​స్టార్​ రజినీకి ప్రతిష్ఠాత్మక అవార్డు

సూపర్​స్టార్​ రజినీకి ప్రతిష్ఠాత్మక అవార్డు

తమిళనాడులోనే అత్యధికంగా పన్నును చెల్లిస్తున్నందుకు గాను సూపర్​స్టార్ రజినీకాంత్​కు ఆదాయపు పన్ను శాఖ అవార్డు ఇచ్చింది. పుదుచ్చేరి గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్ ముఖ్యఅతిథిగా హాజరై ఈ అవార్డును బహూకరించారు.​ నటుడు సూపర్​స్టార్​ రజినీకాంత్​కు అరుదైన గౌరవం దక్కింది. తమిళనాడులో అత్యధికంగా ఆదాయపు పన్నును చెల్లిస్తున్నందుకుగాను.. ఆ శాఖ ప్రతిష్ఠాత్మక అవార్డును రజనీకి ప్రదానం చేసింది. చెన్నైలో జరిగిన ఆదాయపు పన్ను దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ అవార్డును బహుకరించారు. ఈ కార్యక్రమానికి పుదుచ్చేరి గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.అయితే, ఈ కార్యక్రమానికి రజినీకాంత్​ హాజరుకాలేదు. ఆయన స్థానంలో పెద్ద కూతురు ఐశ్వర్య ఈ అవార్డును స్వీకరించారు. ముఖ్యఅతిథిగా హాజరైన తమిళసై మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిరంతర కృషి వల్లే ప్రజలు పన్నులు కట్టేందుకు ముందుకు వస్తున్నారని తెలిపారు. ప్రతిఒక్కరూ ప్రభుత్వానికి పన్నులు చెల్లించాలని కోరారు. పన్నులు చెల్లించకపోతే మనం ఉనికిని కోల్పోతామని ఆమె పేర్కొన్నారు.