NRI-NRT

చికాగోలో మండలి బుద్ధప్రసాద్ మీట్ అండ్ గ్రీట్

చికాగోలో  మండలి బుద్ధప్రసాద్  మీట్ అండ్ గ్రీట్

మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ చికాగో పర్యటన సందర్భంగా ఎన్ ఆర్ ఐ టీడీపీ పర్యవేక్షణలో, స్తానిక టీడీపీ నాయకులు హేమ కానూరు ఆధ్వర్యంలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం నిర్వహించru

ఈ కార్యక్రమానికి యుగంధర్ యడ్లపాటి అధ్యక్షత వహించగా, మురళి మేరుగ శాలువాతో బుద్ధ ప్రసాద్ ను సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా బుద్ధ ప్రసాద్ అభిమానులను ఉద్దేశిస్తూ వర్తమాన రాజకీయాలతో పాటుగా తెలుగు జాతి వైభవాన్ని గుర్తు చేస్తూ అనేక ప్రముఖులు మరియు అన్న శ్రీ నందమూరి తారక రామారావు హయాంలో తెలుగు జాతికి లభించిన గుర్తింపు నుంచి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పాలనలో రెండు తెలుగు రాష్ట్రాలలో జరిగిన అభివృద్ధి వరకు ప్రస్తావించడం జరిగింది.

అలాగే ప్రవాసాంధ్రులకి పిలుపునిస్తూ తెలుగు జాతి ఔనత్యాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను, గాడి తప్పిన రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి పథంలో నడిపించగల నాయకుడిని గెలిపించుకోవాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తూ ముగించారు. ఈ కార్యక్రమాన్ని ఎన్ అర్ ఐ టీడీపీ చికాగో ప్రతినిధులు రవి కాకర, చిరంజీవి గల్లా, కృష్ణ మోహన్, హను చెరుకూరి, శివ త్రిపురనేని, వినోజ్ చనుమోలు, రఘు చిలుకూరి, కిషోర్ త్రిపురనేని, పవన్ నల్లమల్ల తదితరులు సమన్వయపరిచి విజయవంతం అవ్వడంలో తోడ్పడ్డారు