Movies

తిరుపతిలో పాపం పెరిగింది: అశ్వనీదత్

తిరుపతిలో పాపం పెరిగింది: అశ్వనీదత్

ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై నిర్మాత అశ్వినీదత్‌ మండిపడ్డారు. తిరుమలలో వెయ్యికాళ్ల మండపం తొలగించినప్పుడు చంద్రబాబును విమర్శించారని అన్నారు. ఆగమశాస్త్రం ప్రకారమే ఆయన వెయ్యికాళ్ల మండపాన్ని తొలగించారని వివరించారు. ప్రస్తుతం తిరుపతిలో జరగని పాపం అంటూ లేదని, ప్రభుత్వం మూడేళ్లలో తిరుపతిని సర్వనాశనం చేసిందని విమర్శించారు. స్వామి ఇంకా పాపాలను ఎందుకు చూస్తున్నాడో తెలియట్లేదని అశ్వినీదత్‌ విచారం వ్యక్తం చేశారు.