NRI-NRT

కోమటి జయరాం సారధ్యంలో 3వ మినీ మహానాడుకు సన్నాహాలు

Auto Draft

ప్రపంచ తెలుగు ప్రజల గుండె చప్పుడు ఎన్టీఆర్ అని ఎన్ఆర్ఐ యూఎస్ కోఆర్డినేటర్ జయరాం కోమటి అన్నారు. జాతి నిర్మాణం వైపు తెలుగు ప్రజలను జాగృతం చేశాడు. పేద, బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం కట్టబెట్టిన సామాజిక ఉద్యమ నిర్మాత. ఆయన నేటి తరానికి ఒక స్ఫూర్తి. భావితరాలకు ప్రేరణ. అందుకే ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను ఏడాది పాటు నిర్వహించబోతున్నాం. అందులో భాగంగా ప్రతి నెల ఒక రాష్ట్రంలో ఈ ఉత్సవాలను ఏర్పాటుచేయడం జరిగింది. ఇప్పటికే బోస్టన్, న్యూజెర్సీలో నిర్వహించాం. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా ఎన్ఆర్ఐ తెలుగుదేశం ఆధ్వర్యంలో 3వ మినీ మహానాడు జులై 31వ తేదీ ఆదివారం కాలిఫోర్నియాలోని బే ఏరియాలో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పొలిట్ బ్యూరో సబ్యులు, శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, గుంటూరు మిర్చి యార్డ్ మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు ముఖ్య అతిథిలుగా పాల్గొంటున్నట్లు కోమటి జయరాం తెలిపారు.
IMG-20220726-WA0105-1