Movies

సినీ ఇండ‌స్ట్రీపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన జ‌యసుధ‌

సినీ ఇండ‌స్ట్రీపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన జ‌యసుధ‌

ప‌ద్నాలుగేళ్ళ వ‌యసులోనే సినీ పరిశ్ర‌మలోకి ఎంట్రీ ఇచ్చి, త‌న స‌హజ న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌లో ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నారు జ‌య‌సుధ‌. 1972లో వ‌చ్చిన ‘పండంటి కాపురం’ సినిమాతో ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైన ఈమె అన‌తి కాలంలోనే అప్ప‌టి అగ్ర క‌థానాయ‌కుల‌తో జోడీ క‌ట్టి స్టార్ హీరోయిన్‌గా వెలుగొందింది. ఐదు ద‌శాబ్ధాల పాటు న‌టిగా ఎన్నో వైవిధ్య భ‌రిత పాత్ర‌లు పోషించి సినీ ఇండ‌స్ట్రీలో త‌న కంటూ ప్ర‌త్యేక స్థానం ఏర్ప‌ర‌చుకుంది. ప్రస్తుతం ఈమె క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా బిజీ బిజీగా గుడుపుతుంది. కాగా తాజాగా జ‌య‌సుధ ఓ ఇంట‌ర్వూలో త‌న 50ఏళ్ళ సినీ కెరీర్‌లో ఎన్నో ఒడిదుడుకులను చూశాన‌ని చెప్పింది. అంతేకాకుండా ఇండ‌స్ట్రీపై, హీరోయిన్‌లపై వివ‌క్ష గురించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది.