Movies

బాక్స్ ఆఫీసు వసూళ్ళ గురించి ఆలోచించకండి.!- రకూల్

Auto Draft

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బాక్సాఫీస్‌ వసూళ్ల గురించి ఆలోచించడం మానుకోవాలని హితవు పలికింది అగ్ర కథానాయిక రకుల్‌ప్రీత్‌సింగ్‌. కరోనా అనంతరం డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో ప్రజల ఆలోచనా ధోరణి మారిందని, అందుకే సినిమాలకు వసూళ్లు రావడం లేదని అభిప్రాయపడింది.ఆమె మాట్లాడుతూ ‘కరోనా తర్వాత సినిమా బిజినెస్‌ మొత్తం అనిశ్చితిలో పడిపోయింది. థియేటర్ల కలెక్షన్స్‌ సినీ తారలకు నైతిక ైస్థెర్యాన్నిస్తాయి. బాక్సాఫీస్‌ నంబర్స్‌ను ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మార్పు రావడానికి కాస్త సమయం పడుతుంది. ఓటీటీలో సినిమాను ప్రేక్షకులు ఆదరించడాన్ని కూడా విజయంగానే భావించాలి