Movies

‘డర్టీ పిక్చర్‌’ సీక్వెల్‌?

‘డర్టీ పిక్చర్‌’ సీక్వెల్‌?

కథానాయిక విద్యాబాలన్‌ కెరీర్‌ను మలుపు తిప్పిన చిత్రాల్లో ‘డర్టీపిక్చర్‌’ ఒకటి. దాదాపు దశాబ్దం క్రితం విడుదలైన ఈ చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. సిల్క్‌స్మిత బయోపిక్‌ ఆధారంగా రూపొందించిన ఈ సినిమాలో విద్యాబాలన్‌ అద్భుతాభినయంతో ప్రేక్షకుల్ని మెప్పించింది. ఆ రోజుల్లోనే 120 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. తాజాగా ఈ చిత్రానికి సీక్వెల్‌ను తెరకెక్కించే సన్నాహాల్లో ఉన్నారు దర్శకుడు మిలన్‌ లుత్రియా. అయితే ఈ సీక్వెల్‌లో విద్యాబాలన్‌ కథానాయికగా నటిస్తుందా? లేదా మరొకరిని ఎంపిక చేసుకుంటారా అనే విషయం తెలియాల్సి ఉంది. ‘డర్టీపిక్చర్‌’ సీక్వెల్‌ గురించి ఇంతవరకు తననెవరూ సంప్రదించలేదని, ఒకవేళ స్క్రిప్ట్‌ నచ్చితే నటించడానికి అభ్యంతరం ఏమీ లేదని విద్యాబాలన్‌ తెలిపింది. ప్రస్తుతం ఈ చిత్రానికి స్క్రిప్ట్‌ రూపకల్పనలో దర్శకుడు మిలన్‌ లుత్రియా బిజీగా ఉన్నారని తెలిసింది. ఈ ఏడాది ఆఖరిలోగా సీక్వెల్‌ విషయంలో స్పష్టత వస్తుందని నిర్మాతలు ఏక్తాకపూర్‌, శోభా కపూర్‌ పేర్కొన్నారు.