NRI-NRT

ఒమన్‌లో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

ఒమన్‌లో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

ఒమన్ దేశంలోని మస్కట్ సీబ్ మబేలా మస్కట్ మున్సిపాలిటీ క్యాంపులో 75వ భారతదేశ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు కొత్త చిన్నయ్య, గాంధారి నరేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి మిఠాయిలు పంచి సంబురాలు చేసుకున్నారు.కార్యక్రమానికి టీఆర్‌ఎస్‌ ఎన్‌ఆర్‌ఐ సెల్ ఒమన్ అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి, ఉపాధ్యక్షులు షేక్ అహ్మద్, తాటి కొండ నర్సయ్య పాల్గొని ప్రసంగించారు. ఎందరో స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలతోనే దేశానికి స్వాతంత్య్రం వచ్చిందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా మన భారతదేశ కీర్తి ప్రతిష్టలు పెంపొందేలా చేయడం ప్రతి భారతీయ పౌరుడి బాధ్యత అని అన్నారు.కార్యక్రమంలో కౌడపు దినేష్, బొడ్డుల కృష్ణ, శ్రీనివాస్, రాజ్ కుమార్, మెరుగు జగన్, బుడ్డల గంగాధర్, మేడిపట్ల లక్ష్మణ్‌, పవన్, కాశిరాం, తెడ్డు కార్తీక్, జగన్, రమేష్, వెంకటేష్, నరేష్, జోగపూర్ శ్రీనివాస్, జంబుక శ్రీనివాస్, కొల్లపురం రాములు, వేణు, భూమేష్, ఆనంద్, నవీన్, శంకర్, ఎల్లయ్య, దినేష్, రాజు, వంశి, రమేష్, సుభాష్, సాయగౌడ్, రాజు, పర్షరాములు, గణేష్, రాంబాబు, నాని, సురేష్, పోషన్న, తదితరులు పాల్గొన్నారు.