మన దేశంలో జరిగే ఎన్నికల్లో ఓటు వేసే హక్కు ప్రవాస భారతీయులకూ కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం స్పందించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కేరళ ప్రవాసీ సంఘం దాఖలు చేసిన పిల్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ జె.కె.మహేశ్వరి, జస్టిస్ హిమాకొహ్లిల ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ఈ అంశంపై పెండింగులో ఉన్న వేరే కేసుతో కలిపి దీనిని విచారించాలని నిర్ణయించింది.