Politics

వైకాపాలో ఇద్దరు మహిళా ఎమ్మెల్యేల మధ్య సిగపట్లు

వైకాపాలో ఇద్దరు మహిళా ఎమ్మెల్యేల మధ్య  సిగపట్లు

గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గానికి అదనపు సమన్వయకర్తగా డొక్కా మాణిక్యవరప్రసాద్‌ను నియమించడం పట్ల ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్ధరాత్రి సమయంలో పార్టీ అనుచరులతో కలిసి జిల్లా అధ్యక్షురాలు మేకతోటి సుచరిత ఇంటి వద్ద నిరసనకు దిగారు. మాణిక్యవరప్రసాద్‌ నియామకంతో ఎమ్మెల్యేను అవమానించారంటూ శ్రీదేవి అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ అధిష్ఠానంతో మాట్లాడదామని ఎమ్మెల్యే శ్రీదేవికి సుచరిత నచ్చజెప్పారు. దీంతో ఆమె ఆందోళన విరమించారు. 10గంటల్లో పార్టీ తన నిర్ణయాన్ని మార్చుకోకుంటే నాలుగు మండలాల్లోని నాయకులు రాజీనామా చేస్తామని హెచ్చరించారు.