మహారాణి ఎలిజబెత్-2 మరణంతో బ్రిటన్ శోకసముద్రంలో మునిగిపోయింది. అంత్యక్రియలు పూర్తయిన తర్వాత ఏడు రోజుల వరకూ రాజ కుటుంబం సంతాప దినాలు పాటిస్తుందని బకింగ్హామ్ ప్యాలెస్ శుక్రవారం ప్రకటించింది. అయితే, అంత్యక్రియలను ఎప్పుడు నిర్వహిస్తారన్నది మాత్రం వెల్లడించలేదు. రెండు వారాల్లోనే చారిత్రక వెస్ట్మినిస్టర్ అబేలో ఈ కార్యక్రమాన్ని పూర్తిచేస్తారని, త్వరలోనే ఈ తేదీ ఖరారు కానుందని బీబీసీ తెలిపింది. ఏడు దశాబ్దాలకుపైగా బ్రిటన్ను పాలించిన ఎలిజబెత్-2… స్కాట్లాండ్లోని తన వేసవి విడిది బల్మోరల్ క్యాజిల్లో గురువారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. సెయింట్ పాల్స్ క్యాథడ్రల్లో శుక్రవారం నిర్వహించిన మహారాణి జ్ఞాపకార్థ ప్రార్థనలకు ప్రధాని లిజ్ ట్రస్, సీనియర్ మంత్రులు హాజరయ్యారు.
అప్పుడే ఎలిజబెత్ అంత్యక్రియలు
Related tags :