NRI-NRT

ఘనంగా మలేషియా తెలంగాణ అసోసియేషన్(మైట) బతుకమ్మ సంబరాలు

ఘనంగా మలేషియా తెలంగాణ అసోసియేషన్(మైట) బతుకమ్మ సంబరాలు

మలేషియా తెలంగాణ అసోసియేషన్ (మైట) ఆధ్వర్యములొ పూల పండుగ అంగరంగ వైభవంగా జరిగింది. కౌలాలంపూర్లోని ద చక్ర రూఫ్ టాప్ హాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రవాసులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. తెరాస శాసనసభ సభ్యుడు గాదారి కిషోర్ కుమార్, బీజేపీ శాసనసభ సభ్యుడు రఘునందన్, సూర్యాపేట జిల్ల్లా పరిషద్ చైర్ పర్సన్ గుజ్జ దీపికా యుగేందర్, ఇండియన్ హైకమిషన్ ఫస్ట్ సెక్రటరీ సుష్మ, మలేషియా తెరాస వింగ్ ప్రెసిడెంట్ చిట్టిబాబు పలువురు పాల్గొన్నారు.

ఈ ఉత్సవాల్లో ఆడపడుచులు రంగు రంగుల పూలతో బతుకమ్మలను తీర్చిదిద్ది ఉయ్యాలా పాటలు పాడారు. అందంగా అలంకరించిన బతుకమ్మలకు జెన్ టాక్టు కంపెనీ తరపున కృష్ణ వర్మ 6గ్రాముల బంగారు బహుమతులను అందజేశారు. మైట ప్రెసిడెంట్ సైదం తిరుపతి, డిప్యూటీ ప్రెసిడెంట్ చొప్పరి సత్య, వైస్ ప్రెసిడెంట్ బూరెడ్డి మోహన్ రెడ్డి, నరేంద్రనాథ్, జనరల్ సెక్రటరీ రవి చంద్ర, జాయింట్ సెక్రటరీ సందీప్, ట్రేసరర్ మారుతీ జాయింట్ ట్రేసరర్ రవీందర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ మెంబెర్స్ రవి వర్మ,కృష్ణ వర్మ, వివేక్, రాములు, సుందర్, కృష్ణరెడ్డి, ఉమెన్స్ వింగ్ ప్రెసిడెంట్ కిరణ్మయి, వైస్ ప్రెసిడెంట్ స్వప్న, అశ్విత ,యూత్ వింగ్ వైస్ ప్రెసిడెంట్ – కిరణ్ గౌడ్, రవితేజ, కల్చరల్ వింగ్ మెంబర్స్ చందు, రామ కృష్ణ, నరేందర్, రంజిత్, సంతోష్, అనూష, దివ్య, సాహితి, సాయిచరని, ఇందు, రోజా, శ్రీలత. మైగ్రంట్ వింగ్ మెంబర్స్ ప్రతీక్, మధు, శ్రీనివాస్, రఘునాథ్, సందీప్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.