Fashion

మీ కుటుంబం స్నేహితులలో కలసి మెలసి ఉండండి, జీవించినంత కాలం ఆనందాన్ని అనుభవించండి..

మీ కుటుంబం  స్నేహితులలో కలసి మెలసి   ఉండండి, జీవించినంత కాలం ఆనందాన్ని అనుభవించండి..

SSC వరకు కలిసి చదువుకున్న నలుగురు మిత్రులు

SSC ఎగ్జామ్ అయ్యాక ఆ హోటల్ కి వెళ్లి టీ, బ్రేక్ ఫాస్ట్ చేద్దాం అని నిర్ణయించుకున్నారు..

అది ఆదివారం, సైకిల్ మీద హోటల్ చేరుకున్నారు.

టీ, అల్పాహారం చేస్తూ దినేష్, సంతోష్, మనీష్, ప్రవీణ్ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు..

యాభై ఏళ్ల తర్వాత మళ్లీ ఇదే తేదీన ఏప్రిల్ 01న ఈ హోటల్‌లో కలుద్దామని నలుగురూ ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నారు..*
ఆ రోజు ఎవరు అయితే చివరగా వస్తారో అతడే బిల్ పే చెయ్యాలి అని కూడా నిర్ణయించుకున్నారు.

అప్పటి వరకు మనమందరం చాలా కష్టపడాలి, మంచి స్థాయికి రావాలి

*తనకు టీ, బ్రేక్‌ఫాస్ట్‌ అందించిన వెయిటర్‌ రాజు ఇదంతా వింటున్నాడు,
sir
నేను ఇక్కడే ఉంటే గనక మీ అందరి కోసం ఈ హోటల్‌లో వేచి ఉంటాను అన్నాడు

* నలుగురూ తదుపరి విద్య కోసం విడిపోయారు..

రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచాయి..

యాభై ఏళ్లలో ఆ నగరంలో సమూల మార్పులు వచ్చాయి,నగర జనాభా పెరిగింది, రోడ్లు, ఫ్లై ఓవర్లు, మెట్రోలు నగర రూపురేఖలే మారిపోయాయి

ఇప్పుడు ఆ హోటల్‌ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌గా మారిపోయింది, వెయిటర్‌ రాజు ఇప్పుడు ఆ హోటల్‌కే యజమాని అయ్యాడు..*

యాభై ఏళ్ల తర్వాత, నిర్ణీత తేదీ ఏప్రిల్ 01 మధ్యాహ్నం, హోటల్ డోర్ వద్దకు విలాసవంతమైన కారు వచ్చింది..

* దినేష్ కారు దిగి వరండా వైపు నడవడం మొదలుపెట్టాడు, దినేష్ కి ఇప్పుడు మూడు జ్యువెలరీ షోరూంలు ఉన్నాయి..*

ప్రవీణ్ సర్ మీ కోసం ఒక నెల క్రితమే టేబుల్ బుక్ చేసారని రాజు చెప్పాడు..

ఒక గంటలో సంతోష్ వచ్చాడు, సంతోష్ నగరానికి పెద్ద బిల్డర్ అయ్యాడు..

ఇప్పుడు ఇద్దరం మాట్లాడుకుంటూ వేరే స్నేహితుల కోసం ఎదురుచూస్తుంటే, మూడో స్నేహితుడు మనీష్ అరగంటలో వచ్చాడు..

అతనితో మాట్లాడిన తర్వాత మనీష్ వ్యాపారవేత్త అయ్యాడని ఇద్దరికీ తెలిసింది.

స్నేహితులు ముగ్గురి కళ్ళు పదే పదే డోర్ వైపు వెళ్తున్నాయి, ప్రవీణ్ ఎప్పుడు వస్తాడా అని.?
హోటల్ యజమాని రాజు చెప్పాడు “ప్రవీణ్ గారు message ఇచ్చారు.మీకు నచ్చినవి మెనూ చూసీ ఆర్డర్ చేసి తినమని “చెప్పారు.

ముగ్గురూ యాభై ఏళ్ల తర్వాత ఒకరినొకరు కలుసుకోవడం ఆనందంగా ఉంది..

గంటల తరబడి జోక్స్ సాగినా ప్రవీణ్ రాలేదు..

తిన్న తర్వాత బిల్ అడిగితే
ఆన్‌లైన్‌లో బిల్లు కట్టినట్లు ముగ్గురికి సమాధానం వచ్చింది..*

సాయంత్రం ఎనిమిది గంటల సమయంలో ఓ యువకుడు కారు దిగి,బయలుదేరేందుకు సిద్ధమవుతున్న ముగ్గురు స్నేహితుల వద్దకు వచ్చాడు, ముగ్గురూ ఆ వ్యక్తిని చూస్తూ ఉండిపోయారు..

యువకుడు “నేను మీ స్నేహితుడు కొడుకు రవిని, మా నాన్న పేరు ప్రవీణ్ అని చెప్పడం మొదలుపెట్టాడు.

ఈ రోజు మీ రాక గురించి నాన్న చెప్పారు, ఈ రోజు కోసమే ఎదురు చూస్తున్నారు.కానీ గత నెలలో తీవ్ర అనారోగ్యంతో మా నాన్న గారు చనిపోయారు..

* మా నాన్న ఇలా అన్నారు ” నేను ఈ లోకంలో లేనని తెలిసినప్పుడు నా స్నేహితులు ఆనందంగా గడపలేరు ఒకరినొకరు కలుసుకున్న ఆనందం కోల్పోతారు*

అందుకే ఆలస్యంగా వెళ్ళమని ఆదేశించాడు..

తన తరపున మిమ్మల్ని కౌగిలించుకోమని కూడా అడిగాడు, రవి తన రెండు చేతులు చాచి..

చుట్టుపక్కల వారు ఈ దృశ్యాన్ని ఆసక్తిగా చూస్తున్నారు, ఈ యువకుడిని ఎక్కడో చూసినట్లు అనుకున్నారు

మా నాన్న టీచర్‌ అయ్యారు, నన్ను మాత్రం కలెక్టరు చదివించడానికి ఎంతో కష్టపడ్డారు.. ఈరోజు నేను ఈ నగరానికి కలెక్టర్‌ని..*
అని రవి చెపుతుంటే
అందరూ ఆశ్చర్యపోయారు, కళ్ళవెంట వస్తున్న దుఃఖాన్ని తనలోనే దిగమింగుతూ మంచి స్నేహితుడిని కోల్పోయామే అనే భాదతో వెనుదిరిగారు..

అందుకే బంధువులతోను స్నేహితులతో కలుస్తూనే ఉండండి, ఏళ్ల తరబడి వేచి ఉండకండి, ఎవరి వంతు ఎప్పుడు వస్తుందో తెలియదు