కర్నూలు: భారత జోడో యాత్ర మూడో రోజు జోరుగా జోడో
గురువారం ఉదయం 7.30గంలకు చెన్నాపురం క్రాస్ రోడ్డు నుంచి పాదయాత్ర ప్రారంభించారు. బనవాసి ఫారం, హనుమాపుం మీదుగా ఎమ్మిగనూరు పట్టణంలోకి ప్రవేశిస్తుంది. ఎమ్మిగనూరు పట్టణంలో అన్నమయ్య సర్కిల్ మీదుగా బైపాస్ రోడ్డు, ఎస్ఎంటీ సర్కిల్, శివసర్కిల్, బస్టాండ్ మీదుగా సోమప్ప సర్కిల్ చేరుకోనుంది. అక్కడ నుంచి పెద్ద మార్కెట్, ట్యాంకుబండ్ రోడ్డు, శ్రీనివాస సర్కిల్, మీదుగా 167వ జాతీయ రహదారిపై చేరుకుంటుంది. అక్కడ ఏర్పాటు చేసిన విడిదిలో మధ్యాహ్నం బస చేయనున్నారు. అక్కడ నుంచి సాయంత్రం మంత్రాలయం మండలం కలుదేవకుంట వరకు కొనసాగుతుంది. రాత్రి మంత్రాలయంలో ఏర్పాటు చేసిన విడిదిలో బస చేయనున్నారు