Politics

అక్రమ నిర్బంధాలపై చంద్రబాబు ఆగ్రహం అనకొండ ల బతుకు బయట పడుతుందని

అక్రమ నిర్బంధాలపై చంద్రబాబు ఆగ్రహం అనకొండ ల బతుకు బయట పడుతుందని

కొండలను మింగిన వైసీపీ అనకొండల బండారం బయట పడుతుందనే టీడీపీ పోరుబాట పై ఆంక్షలు:- విశాఖలో నిర్బంధాలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్వీట్

ఉత్తరాంధ్రలో వైసీపీ దోపిడీపై టీడీపీ పోరుబాటను ప్రభుత్వం అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. కొండలను సైతం మింగుతున్న వైసీపీ అనకొండల బండారం బయట పెట్టేందుకే మా నేతల పోరుబాట. మహిళా నేతలను సైతం నిర్బంధించడం పాలకుల అరాచకత్వానికి నిదర్శనం.

ఉత్తరాంధ్రలో ప్రభుత్వ భూములు, ప్రజల ఆస్తులను దోచుకున్నందునే టీడీపీ పోరుబాట పై ప్రభుత్వం భయపడుతుంది. ఎవరు ఎంతగా అడ్డుకున్నా ‘సేవ్ ఉత్తరాంధ్ర’ నినాదం ఆగదు.

రుషికొండ విధ్వంసం, దసపల్లా భూముల దోపిడీలు, ఆస్తుల ఆక్రమణలు, గంజాయి సాగు-అమ్మకాలు, అక్రమ మైనింగ్‌ పై వైసీపీ దారుణాలను ప్రజల ముందు ఉంచి తీరుతాం. ఉత్తరాంధ్రకు అండగా నిలుస్తాం.