BusinessPolitics

విశాఖ రైల్వే జోన్ కు ఎట్టకేలకు మోక్షం

విశాఖ రైల్వే జోన్ కు ఎట్టకేలకు మోక్షం

నవంబర్ 12న విశాఖ రైల్వేజోన్ కు శంకుస్థాపన..

సీఎం జగన్ తో కలిసి పనులను ప్రారంభించనున్న ప్రధాని మోదీ..

నవంబర్ 11, 12 తేదీల్లో విశాఖలో పర్యటన…

వడ్లపూడి వ్యాగన్ వర్క్ షాప్ జాతికి అంకితం..

రూ.446 కోట్లతో విశాఖ రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన

రూ.26 వేల కోట్లతో హెచ్పీసీఎల్ విస్తరణ ప్రారంభం

గంభీరంలో నిర్మించిన ఐఐఎం(వైజాగ్)భవనానికి శ్రీకారం

రూ.380 కోట్లతో ఈఎస్ఐ ఆస్పత్రికి శంకుస్థాపన కూడా

ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరే సమయం వచ్చేసింది. విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటుకానున్న దక్షిణ కోస్తా రైల్వేజోన్లు శంకుస్థాపన ముహూర్తం కుదిరింది.

ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్ర మోదీ మూడోసారి విశాఖలో పర్యటన దాదాపు ఖరారైన నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితో కలిసి ఆయన రైల్వే జోన్ శంకుస్థాపన పనులకు శ్రీకారం చుట్టను న్నారు.

ఇందుకోసం నవంబర్ 11న విశాఖకు ఆయన రానున్నారని అధికారిక వర్గాల సమాచారం. ఈ పర్యటనలో రూ.వేల కోట్ల అభివృద్ధి పసులకు శ్రీకారంతో పాటు ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారు.

ప్రధాని పర్యటన నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా… విశాఖలో రెండ్రోజుల పాటు పర్యటిస్తారు. ఇందులో భాగంగా.. నవంబర్ 11న ఆయన విశాఖ చేరుకుని ప్రధానితో కలిసి ఆయా కార్యక్రమాల్లో పాల్గొంటారు.