Politics

జర్నలిస్టులకు ‘క్యాష్‌ గిఫ్ట్‌లు’ మరో వివాదంలో కర్ణాటక సీఎం

జర్నలిస్టులకు ‘క్యాష్‌ గిఫ్ట్‌లు’   మరో వివాదంలో  కర్ణాటక సీఎం

దర్యాప్తునకు కాంగ్రెస్​ డిమాండ్​ కర్ణాటక సీఎం కార్యాలయం నుంచి పలువురు జర్నలిస్టులకు రూ.లక్ష నుంచి రూ.2.5లక్షల వరకు నగదు బహుమతులు అందడం ఆ రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపింది. దీనిపై దర్యాప్తు జరపాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేస్తోంది. కర్ణాటకలో సీఎం బసవరాజు బొమ్మై నేతృత్వంలోని బీజేపీ సర్కారు మరో వివాదంలో చిక్కుకుంది. దీపావళి సందర్భంగా ముఖ్యమంత్రి బొమ్మై కార్యాలయానికి చెందిన అధికారి ఒకరు జర్నలిస్టులకు రూ.లక్షల్లో నగదు బహుమతులు పంపించారని ఆరోపణలు వచ్చాయి. కొందరు జర్నలిస్టులకు స్వీటు బాక్సులతో పాటు రూ.లక్ష నుంచి రూ.2.50లక్షల వరకు లంచాలు పంపినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి. దీంతో ఈ వ్యవహారంపై దర్యాప్తు జరపాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. తాజా ఘటన నేపథ్యంలో బొమ్మై సర్కారుపై కాంగ్రెస్‌ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. ‘సర్కారు రూ.లక్షల్లో లంచాలు ఇచ్చేందుకు ప్రయత్నించింది. 1. ఇది సీఎం ఆపర్‌ చేసిన లంచం కాదా? 2. ఈ లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయి? ప్రభుత్వ ఖజానా నుంచా లేదా సీఎం వ్యక్తిగత ఖాతా నుంచా? 3. దీనిపై ఈడీ/ఐటీ చర్యలు తీసుకుంటుందా? ఈ ప్రశ్నలకు బొమ్మై సమాధానం చెప్పగలరా?’ అని కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీ రణ్‌దీప్‌ సింగ్‌ సుర్జేవాలా ట్విటర్‌లో విమర్శించారు. దీనిపై జ్యుడిషియల్‌ దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది.