Politics

మోటర్లకు మీటర్లు పెట్టడం తెలుసు కానీ..ప్రజల ప్రాణాలు కాపాడటం తెలీదా..?

మోటర్లకు మీటర్లు పెట్టడం తెలుసు కానీ..ప్రజల ప్రాణాలు కాపాడటం తెలీదా..?

కడప జిల్లాలో ముగ్గురు రైతుల మృతి బాధాకరమని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు.

అమరావతి: కడప జిల్లాలో ముగ్గురు రైతుల మృతి బాధాకరమని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu naidu) ఆవేదన చెందారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ… రాష్ట్రంలో మిగితా చోట్ల విద్యుత్‌ ప్రమాదాల్లో మరో ఇద్దరు మృత్యువాత పడ్డారన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం ఐదుగురిని బలితీసుకోవడం విషాదకరమని అన్నారు. ”మోటార్లకు మీటర్లు బిగించడం తెలుసు, ఛార్జీలు పెంచడం తెలుసు.. మీటర్ల పేరిట వేల కోట్ల స్కామ్‌ చేయడం వైసీపీకి తెలుసు. కానీ.. విద్యుత్‌ ప్రమాదాలను నివారించడం మాత్రం తెలియదా. అవసరమైన సిబ్బంది నియామకం వైసీపీ ప్రభుత్వానికి తెలియదా” అంటూ చంద్రబాబు (TDP Chief) ట్విట్ చేశారు.