NRI-NRT

ఖతార్‌ ఆంధ్ర కళావేదిక వనభోజనాలు

ఖతార్‌ ఆంధ్ర కళావేదిక వనభోజనాలు

కార్తీక మాసం సందర్భంగా ఖతార్‌లోని ఆంధ్ర కళావేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక మాస వనభోజనాలు ఆద్యంతం సందడి కొనసాగాయి. మొసయిద్‌ ఫ్యామిలీ పార్కులో తొలిసారి నిర్వహించిన ఈ కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చింది. ఈ సందర్భంగా ఆంధ్ర కళావేదిక అధ్యక్షులు వెంకప్ప భాగవతుల మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి ఒక్కరోజులోనే ౩౦౦మందికి పైగా రిజిస్ట్రేషన్లు చేసుకుని రికార్డు సృష్టించారని తెలిపారు. ఈ కార్యక్రమం కోసం తమ కార్యవర్గ బృందం చేసిన కృషి అభినందనీయమని కొనియాడారు. ఎండను సైతం లెక్కచేయకుండా ఈ వనభోజనాలకు దాదాపు 450మందికి పైగా చిన్నా, పెద్ద అంతా కలిసి హాజరై సందడి చేశారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఘనంగా విజయవంతం చేసినందుకు సహకరించిన స్పాన్సర్లు, స్వచ్ఛంద సేవకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.