NRI-NRT

గుత్తికొండ శ్రీనివాస్ అధ్యక్షతన TAMPAలో ఎన్నారై తెదేపా సదస్సు

గుత్తికొండ శ్రీనివాస్ అధ్యక్షతన  TAMPAలో ఎన్నారై తెదేపా సదస్సు

ఫ్లోరిడా రాష్ట్రం లోని టాంపా నగరంలో NRI టిడిపి ఆధ్వర్యంలో జరిగిన మీట్ అండ్ గ్రీట్ సభకు టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు వై.వి.బి. రాజేంద్ర ప్రసాద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు

రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ …..చంద్ర బాబు ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెంది ఆంధ్ర ప్రదేశ్ అంటే అభివృద్ధి ప్రదేశ్ గా ఉండేదనీ , జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అరాచకం,అవినీతి,అక్రమాలకు చిరునామాగా మారిపోయిందని అన్నారు,అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు,.
మళ్ళీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి పూర్వ వైభవం రావాలన్నా,రాష్ట్రం అభివృద్ధిచెంది ప్రజలు సుభిక్షం గా ఉండాలన్నా చంద్ర బాబు నాయుడు నాయకత్వమోక్కటే మార్గమని అన్నారు .అందుకనే నాయకులందరూ చంద్రబాబు ని ముఖ్యమంత్రిగా చేయడమే ఏకైక లక్ష్యంగా కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు

మరో అతిథిగా పాల్గొన్న టిడిపి సీనియర్ నాయకులు A.V. రమణ మాట్లాడుతూ..
జగన్ రెడ్డి తన సైకో మనస్తత్వం తో కుల, మత,ప్రాంత విద్వేషాలను రెచ్చగొడుతూ ,రాష్ట్రం లో అన్ని వర్గాల ప్రజలను భయపెడుతూ రాక్షసానందం పొడుతున్నారని అన్నారు.

ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన నాట్స్ EX చైర్మెన్ గుత్తికొండ శ్రీనివాసు ప్రసంగిస్తూ…చంద్రబాబు పాలనలో ప్రవాస భారతీయులు ఏపీలో పెట్టుబడులుపెట్టడానికి ఉత్సాహంగా ముందుకు వచ్చేవారనీ కానీ ప్రస్తుత జగన్ అరాచక పాలనలో ప్రవాస భారతీయులు అసలు ఆంధ్ర ప్రదేశ్ కి రావడానికే భయపడుతున్నారని అన్నారు

ఇంకా ఈ కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ dr.దేవయ్య పగిడిపాటి ప్రముఖ ఐ టీ కంపెనీ అధినేత వీరమాచినేని శ్రీధర్ శ్రీనాథ్ రావుల గ శ్రీనివాస్ మల్లాది NRI టిడిపి ఇంచార్జ్ అజయ్ దండమూడి ప్రశాంత్ పిన్నమనేని ,శివ తాళ్లూరి ప్రసాద్ కొసరాజు నాగేంద్ర తుమ్మల తదితరులు పాల్గొని ప్రసంగించారు