భీమనేని శివ ప్రసాద్ – తన్నీరు రాంబాబు నిర్మించిన చిత్రం ‘నేనెవరు’. నిర్ణయ్ పల్నాటి దర్శకుడు. కోలా బాలకృష్ణ, సాక్షి చౌదరి జంటగా నటించారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలోనే విడుదల చేస్తారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ‘‘ఇదో సస్పెన్స్ థ్రిల్లర్. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి ఇస్తుంది. నటీనటులంతా కొత్తవారే. వాళ్లందరికీ ఈ చిత్రం మంచి గుర్తింపు తీసుకొస్తుంది. త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తామ’’న్నారు