NRI-NRT

మునుగోడు గెలుపు తెలంగాణ ప్రజల విజయం: టీఆర్ఎస్ ఎన్‌ఆర్‌ఐ ఒమాన్

మునుగోడు గెలుపు తెలంగాణ ప్రజల విజయం: టీఆర్ఎస్ ఎన్‌ఆర్‌ఐ ఒమాన్

దేశ రాజకీయాలపై ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్న బీజేపీని ఎదుర్కొనే సత్తా సీఎం కేసీఆర్‌కు మాత్రమే ఉందని టీఆర్‌ఎస్‌ ఎన్‌ఆర్‌ఐ ఒమన్‌ శాఖ అధ్యక్షుడు ఈగపూరి మహిపాల్‌ రెడ్డి అన్నారు. దేశ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పారు. మునుగోడు ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి గెలుపొందిన సందర్భంగా ఎన్‌ఆర్‌ఐ ఒమన్‌ శాఖ ఆధ్వర్యంలో మస్కట్‌లో సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిపాల్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఈ విజయం కేవలం మునుగోడు ప్రజాలదే కాదని, యావత్ తెలంగాణ గెలుపన్నారు.
Oman-V-jpg-816x480-3g-1
సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో మొదలవుతున్న భారత్ రాష్ట్ర సమితికి (బీఆర్‌ఎస్‌) మునుగుడు ప్రజలు తొలి విజయంతో గట్టి పునాది వేశారని చెప్పారు. రాబోయే గుజరాత్ ఎన్నికల్లో, దేశ రాజకీయాల్లో కూడా కేసీఆర్ నాయకత్వంలో బీఆర్‌ఎస్ శ్రేణులు ఇదే హుషారుతో పనిచేసి బీజేపీకి గట్టి బుద్ధి చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఆర్‌ఐ సెల్‌ ఉపాధ్యక్షుడు షేక్ అహ్మద్, రాకేష్ పటేల్, అజీమ్, శ్రీను కళ్యాణ్, రహ్మత్ అలీ, రాజు యాదవ్, బషీర్ అలీ, సందీప్ పాల్గొన్నారు.