WorldWonders

భారత్‌లోకాలుష్య నిలయాలుగా 163 నగరాలు

భారత్‌లోకాలుష్య నిలయాలుగా 163 నగరాలు

భారత్‌లో ఈ ఏడాది కాలుష్య స్థాయిలు మరింత దిగజారాయి. భారత్‌లో మొత్తం 163 నగరాలు కాలుష్య నిలయాలుగా మారాయని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డ్‌ (సిపిసి) విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. ఈ నగరాల్లో కాలుష్య స్థాయిలు ప్రమాదకరంగా ఉన్నట్లు సిపిసి పేర్కొంది. వాయు నాణ్యతా సూచీ (ఎక్యూఐ) అత్యధికంగా 360తో బీహార్‌లో కతిహార్‌ మొదటి స్థానంలో ఉండగా, తర్వాతి స్థానాల్లో వరుసగా ఢిల్లీ, నొయిడా, ఘజియాబాద్‌, బీహార్‌లోని బెగుసరై, హర్యానాలోని బల్లాబ్‌ఘర్‌, ఫరీదాబాద్‌, ఖైతిహాల్‌, గురుగ్రామ్‌, మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లు నిలిచాయి.వాహన కాలుష్యంతో పాటు పంటవ్యర్థాలను తగుల బెట్టడంతో కాలుష్య స్థాయిలు ప్రమాదకరస్థాయికి చేరుకుంటున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. బుధవారం ఒక్కరోజే పంజాబ్‌లో 3,634 పంట వ్యర్థాలను తగులబెట్టినట్లు ఇండియన్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఐఎఆర్‌ఐ) పేర్కొంది. ఈ ఏడాదిలో ఇదే అత్యధికమని వెల్లడించింది. విషవాయువులు ప్రజల ఊపిరితిత్తులపై ప్రభావం చూపడమే కాకుండా శ్వాసకోస సమస్యలతో అకాల మరణాలకు దారితీస్తున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 2017లో వాయు కాలుష్యం కారణంగా 1.2 మిలియన్లకు పైగా భారతీయులు అకాల మృత్యు బారిన పడినట్లు గ్రీన్‌పీస్‌ సంస్థ తెలిపింది.