సినీ పరిశ్రమలో ఉన్న టాలెంటెడ్ హీరోయిన్లలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఒకరు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్డమ్ కొట్టేసిన రష్మిక ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలు కూడా చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. అయితే కెరీర్ ప్రారంభం నుంచి కొంతమంది నెటిజన్ల నుంచి ఎదురైన నెగెటివ్ కామెంట్స్ , ట్రోలింగ్స్ పై ఇన్ స్టాగ్రామ్లో స్పందించింది రష్మిక.గత కొన్ని రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాల (కూడా కావొచ్చు) నుంచి కొన్ని విషయాలు నాకు చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. ఆ విషయం గురించి మాట్లాడేందుకు ఇదే సరైన సమయం అనుకుంటున్నా. నేను నా కోసం మాత్రమే మాట్లాడుతున్నాను ఇది కొన్ని సంవత్సరాల క్రితం చేయవలసిన పని..అని ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ను మొదలుపెట్టింది.
నా కెరీర్ని మొదలు పెట్టినప్పటి నుండి నేను చాలా ద్వేషానికి గురవుతున్నాను. నా మీద చాలా ట్రోలింగ్స్ , నెగిటివ్ పంచింగ్స్ వేస్తున్నారు. నేను ఎంచుకున్న జీవితం ఖరీదైనదని నాకు తెలుసు. ప్రతీ ఒక్కరికీ నేను నచ్చాలని ఏమీ లేదు. మిమ్మల్నందరినీ సంతోషంగా ఉంచడానికి నేను చేసే పని మాత్రమే నాకు తెలుసు. నా పని (సినిమాలు) ద్వారా మీరు పొందే ఆనందాన్ని మాత్రమే నేను ఎక్కువగా పట్టించుకుంటున్నాను. మీరు, నేను గర్వించే విషయాలను బయట పెట్టేందుకు నిజంగా నా శక్తి మేరకు ప్రయత్నిస్తున్నా.
నిరుత్సాహానికి గురవుతున్నా..
మరీ ముఖ్యంగా నేను వెల్లడించని విషయాల కోసం ఇంటర్నెట్లో నన్ను ఎగతాళి చేస్తున్నప్పుడు హృదయ విదారకమైన స్థితిలోకి వెళ్లిపోయి..నిరుత్సాహానికి గురవుతున్నాను. నేను ఇంటర్వ్యూల్లో చెప్పిన కొన్ని విషయాలు నాకు వ్యతిరేకంగా మారుతున్నాయని తెలుసుకున్నా. ఇండస్ట్రీలో లేదా బయట నాకున్న సంబంధాలకు హాని కలిగించే తప్పుడు కథనాలు ఇంటర్నెట్లో దర్శనమిస్తుంటాయని చెప్పుకొచ్చింది.నిర్మాణాత్మక విమర్శలు బాగుంటాయి..ఉత్తమంగా కెరీర్ను డిజైన్ చేసుకునేందుకు అవి సహాయపడతాయి.. కానీ ఈ రకమైన నెగెటివిటీ, తప్పుడు స్టేట్మెంట్స్ నన్ను అనవసరమైన ఒత్తిడికి గురి చేస్తున్నాయి. మొదటి నుంచి నాకు మద్దతుగా నిలిచిన అభిమానులకు కృతజ్ఞతలు..నేను మీ కోసం కష్టపడి పని చేస్తూనే ఉంటాను..అంటూ సందేశాన్ని ముగించింది రష్మిక.