NRI-NRT

పిలడెల్ఫియాలో తానా కిక్ ఆఫ్ సభ

Auto Draft

తానా.. అమెరికా‌లోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో కూడా అనేక సేవా కార్యక్రమాలను చేపడుతోంది. తెలుగు ప్రజలకు అండగా ఉంటుందన్న విషయం తెలిసిందే. కాగా.. ‘తానా మహాసభలు-2023’ నేపథ్యంలో అమెరికాలోని ఫిలడెల్ఫియా నగరంలో కిక్ ఆఫ్ సభను తానా నిర్వహించింది. ఈ సభకు ముఖ్య అతిథులుగా వై.వి.బి. రాజేంద్రప్రసాద్, గుంటూరు మిర్చి యార్డ్ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు, సింగర్ గీతా మాధురి, బుచ్చి రాంప్రసాద్, మూల్పూరి వెంకటేశ్వరరావు హాజరయ్యారు. ఈ క్రమంలో వేదికపై ముఖ్య అతిథులను తానా ఘనంగా సత్కరించింది.

ఈ కార్యక్రమంలో తానా మాజీ అధ్యక్షులు జయ తాళ్లూరి, సతీష్ వేమన, ప్రెసిడెంట్ ఎలక్ట్ నిరంజన్ శృంగవరపు, బొబ్బా రామ్, రావుల శ్రీనాథ్, వంశి వాసిరెడ్డి, రవి మందలపు, కోయ హరీష్, కే.సీ. చేకూరి, ప్రొఫెసర్ కొడాలి నవీన్ తదితలురు పాల్గొని ప్రసంగించారు. అమెరికాలోని పలు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున తానా ఆర్గనైజర్స్, సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.