Fashion

ఫోర్బ్స్ మహిళా పారిశ్రామిక వేత్తల్లో మనదేశం నుండి ముగ్గురు

ఫోర్బ్స్ మహిళా పారిశ్రామిక వేత్తల్లో మనదేశం నుండి ముగ్గురు

ఫోర్బ్స్ ఆసియా నవంబరు మ్యాగజైన్ లో ముగ్గురు భారత మహిళా వ్యాపారవేత్తలకు చోటు దక్కింది. మూడేళ్ల పాటు కరోనా పరిణా మాలు ఇబ్బంది పెట్టినా, వ్యాపారాలను తమదైన వ్యూహాలతో ముందుకు నడి పించిన 20 మంది ఆసియా మహిళలతో ఒక జాబితాను ఫోర్బ్స్ ప్రచురించింది.

* భారత్ నుంచి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ సోమా మండల్: ఎమ్యూర్ ఫార్మా భారత వ్యాపార ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నమితా థాపర్; హొనాసా కన్జూమర్ సహ-వ్యవస్థాపకులు, చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ ఘజల్ అలఘ్ ఈ జాబితాలో నిలిచారు.

* కొంత మంది మహిళలు నౌకాశ్రయాలు, స్థిరాస్తి, నిర్మాణ రంగం వంటి కరోనా వల్ల ఎక్కువగా ప్రభావితమైన విభాగాల్లో, టెక్నాలజీ, ఔషధ, కమొ డిటీ రంగాల్లోనూ రాణించారని ఫోర్బ్స్ కొనియాడింది.

* ఆస్ట్రేలియా, చైనా, దక్షిణ కొరియా, ఇండోనేషియా, జపాన్, సింగపూర్, తైవాన్, థాయ్లాండ్ దేశాల మహిళలూ ఈ జాబితాలో ఉన్నారు.