NRI-NRT

శ్రీశ్రీ రవిశంకర్‌కు గాంధీ పీస్‌ పిలిగ్రిమ్‌ అవార్డు

Auto Draft

ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్‌ ప్రతిష్ఠాత్మక గాంధీ పీస్‌ పిలిగ్రిమ్‌ అవార్డును అందుకొన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ, అమెరికా పౌర హక్కుల ఉద్యమ నేత డాక్టర్‌ మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ జూనియర్‌ ప్రవచించిన అహింస, శాంతి సందేశాన్ని వ్యాపింపజేసేందుకు శ్రీశ్రీ రవిశంకర్‌ చేసిన అవిశ్రాంత ప్రయత్నాలను గుర్తిస్తూ అమెరికాలోని గాంధీ ఫౌండేషన్‌ అట్లాంటాలో ఈ అవార్డును ప్రదానం చేసింది. మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ జూనియర్‌ మేనల్లుడు ఇసాక్‌ ఫారిస్‌, అట్లాంటాలోని భారత కాన్సుల్‌ జనరల్‌ డాక్టర్‌ స్వాతి కులకర్ణి సమక్షంలో ఆయనకు ఈ అవార్డును ప్రదానం చేశారు.