‘మొదటి సినిమా’ చిత్రంతో టాలీవుడ్కు పరిచయమయ్యారు ఉత్తరాది బ్యూటీ పూనమ్ బజ్వా. నాగార్జున ‘బాస్’ చిత్రంతోనూ ఆకట్టుకొంది. ‘తేనవట్టు’ చిత్రంతో తమిళ ప్రేక్షకులకు సుపరిచితమయ్యారామె. ఆ తర్వాత పలు తమిళ చిత్రాల్లో నటించిన ఆమె కొంతగ్యాప్ తర్వాత మళ్లీ తమిళ తెరపై మెరవనున్నారు. తాజాగా ఆమె ‘గురుమూర్తి’ అనే చిత్రంలో నాయికగా నటించింది. నట్టి నటరాజ్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా పూనమ్ బజ్వా (Poonam Bajwa Skin show) ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. టాలీవుడ్, కోలీవుడ్లో అంతగా సినిమాలు చేయకపోవడానికి కారణమేంటని ప్రశ్నించగా ‘నచ్చని పాత్రల జోలికి వెళ్లడం లేదని’ సమాధానమిచ్చింది. 2009లో నటిగా కోలీవుడ్కు పరిచయం అయ్యాను. దాదాఉ 12 సంవత్సరాలు నటిగా కొనసాగాను. ఇది సంతోషించదగ్గ విషయం. తమిళంలో ఎక్కువగా కుటుంబ కథా చిత్రాల అవకాశాలే వచ్చాయి. గ్లామర్ పాత్రలు చేసే అవకాశం దక్కలేదు. దక్షిణాదిన నాకు ఎక్కువ మంది ఫాలోయర్లు ఉన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో నేను పోస్ట్ చేస్తున్న గ్లామరస్ ఫొటోలను వారంతా ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నారు. అందుకే ఆ ఫొటోలు పోస్ట్ చేస్తున్నా. గ్లామర్ పాత్రలకు సిద్ధంగా ఉన్నా. నా దృష్టిలో గ్లామర్కు, స్కిన్ షోకు తేడా చాలా తేడా చెప్పింది. ఇప్పటి దాకా లిమిట్స్ దాటి స్కిన్ షో చేయలేదు. క్యారెక్టర్ డిమాండ్ చేస్తే గ్లామర్ పాత్రకు సిద్ధమే. కోలీవుడ్లో నేను నటించాల్సి హీరోల లిస్ట్ చాలానే ఉంది. జీవా, భరత్ నాకు మంచి మిత్రులు’’ అని చెప్పుకొచ్చింది