Movies

లెక్కలేనన్ని సార్లు చూశా

లెక్కలేనన్ని సార్లు చూశా

18 ఏండ్ల కిందట ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయం సాధించిన సినిమా ‘వర్షం’. ప్రభాస్‌, త్రిష జంటగా నటించిన ఈ సినిమా ఇటీవల రీ రిలీజ్‌ అయ్యింది. ఈ సినిమాను థియేటర్‌లో ప్రదర్శిస్తున్నారు. ఈ వీడియో క్లిప్స్‌ను ఇప్పుడు సోషల్‌ మీడియాలో ప్రభాస్‌, త్రిష అభిమానులు వైరల్‌ చేస్తున్నారు. ఈ సినిమా రీ రిలీజ్‌పై స్పందించింది నాయిక త్రిష. ఆమె ఇన్‌స్టాలో పోస్ట్‌ చేస్తూ…‘నా తెలుగు సినిమా 18 ఏండ్ల తర్వాత మళ్లీ థియేటర్‌లలో విడుదలైంది. ఈ సినిమా నిన్ననే జరిగినట్లు అనిపిస్తున్నది. కొన్ని సినిమాలు చిరకాలం నిలిచి ఉంటాయనేందుకు ఇదే ఉదాహరణ.
మొదటి చిత్రంగా ‘వర్షం’ మూవీ అంటే నాకెంతో ఇష్టం.ఇప్పటిదాకా లెక్కలేనన్ని సార్లు ఈ సినిమాను చూశాను. మీ అభిమానమే నన్ను ఇప్పటికీ నాయికగా ముందుకు నడిపిస్తున్నది’ అని పేర్కొంది. ఎంఎస్‌ రాజు నిర్మాణంలో దర్శకుడు శోభన్‌ ఈ చిత్రాన్ని రూపొందించారు. వర్షం సాక్షిగా సాగే ప్రేమ కథగా ప్రేక్షకులను ఆకట్టుకుందీ సినిమా. 2004 సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సాధించి ప్రభాస్‌కు స్టార్‌డమ్‌తో పాటు త్రిషకు తెలుగులో అనేక అవకాశాలను తీసుకొచ్చింది.
Powered By