తెలుగుతో పాటు హిందీ పరిశ్రమలో కూడా సత్తా చాటుతున్నది కన్నడ సోయగం రష్మిక మందన్న. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో భారీ సినిమాలున్నాయి. అయితే సెంటిమెంట్స్కు ఎంతో ప్రాధాన్యతనిచ్చే సినీరంగంలో రష్మికను ఓ భయం వెంటాడుతున్నది. ఇటీవలకాలంలో తెలుగు, హిందీ ఇండస్ట్రీల్లో సత్తా చాటిన నాయికలు తమిళంలో మాత్రం వెనకబడుతున్నారు. టాలీవుడ్లో అగ్ర నాయికల్లో ఒకరిగా చెలామణి అవుతున్న పూజాహెగ్డే తమిళంలో ‘బీస్ట్’ సినిమాలో దళపతి విజయ్తో జతకట్టింది. తమిళంలో టాప్ హీరో అయిన విజయ్ సరసన నటించినా…ఆ సినిమా పూజాహెగ్డే కెరీర్కు ఏ మాత్రం హెల్ప్ కాలేదు. అదే కోవలో ‘సుల్తాన్’ సినిమా ద్వారా తమిళంలో అరంగేట్రం చేసింది రష్మిక మందన్న. ప్రస్తుతం దళపతి విజయ్ సరసన ‘వారిసు’ (తెలుగులో ‘వారసుడు’)లో నటిస్తున్నది. ఈ సినిమా తమిళంలో తనకు మంచి బ్రేక్నిస్తుందనే ఆశాభావంతో ఉంది రష్మిక మందన్న. అదే సమయంలో పూజాహెగ్డే తరహాలోనే సెంటిమెంట్ కూడా వెంటాడుతున్నది. ఈ సినిమా తర్వాతనైనా తమిళంలో బిజీ కావాలనే ఆలోచనతో ఉంది రష్మిక మందన్న. మొత్తానికి ‘వారిసు’చిత్రం కోలీవుడ్లో రష్మిక మందన్న కెరీర్ను నిర్ణయించే చిత్రమని చెబుతున్నారు. ప్రస్తుతం రష్మిక మందన్న తెలుగులో ‘పుష్ప-2’ చిత్రంలో నటిస్తున్నది.