తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ టీడీపీ నెదర్లాండ్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుల వివరాలను ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. ఎగ్జిక్యూటివ్ కమిటీ అధ్యక్షుడిగా వివేక్ కరియావుల, జనరల్ సెక్రటరీగా వెంకట్ కోకా, ట్రెజరర్గా తేజా గోయెల్లా, రిజనల్ కౌన్సిల్ రిప్రెసెంటేటివ్గా శ్యామ్ పంపానా, సోషల్ మీడియా కోఆర్డినేటర్గా మధుకర్ రెడ్డి బండర్లను నియమిస్తూ ప్రకటన విడుదల చేసింది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకే ఎన్ఆర్ఐ టీడీపీ నెదర్లాండ్స్ ఎగ్జిక్యూటివ్ను ఏర్పాటు చేసినట్టు వివరించింది