తనపై నమోదు చేసిన చీటింగ్ కేసును కొట్టివేయాలంటూ కేరళ హైకోర్టును ఆశ్రయించింది బాలీవుడ్ తార సన్నీ లియోన్. కొచ్చిలోని పెరంబవుర్కు చెందిన ఈవెంట్ నిర్వాహకుడు ఎం షియాస్ ఆమెపై చీటింగ్ కేసు పెట్టారు. 2019లో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు సన్నీ లియోన్ మేనేజర్కు 30 లక్షల రూపాయలు చెల్లించామని, ఈవెంట్కు రాలేదని షియాస్ ఆరోపిస్తున్నారు. సన్నీ లియోన్ స్పందిస్తూ…‘అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత చాలా సార్లు కార్యక్రమ తేదీని మార్చారు. దాంతో నాకు ఈ ఈవెంట్లో పాల్గొనేందుకు కుదరలేదు. నేనెవరినీ చీటింగ్ చేయలేదు అంది.