ఇటీవల మృతి చెందిన ప్రముఖ సినీనటుడు “నటశేఖర” ఘట్టమనేని కృష్ణకు అమెరికాలోని మిషిగన్ ప్రవాసులు ఘనంగా నివాళి అర్పించారు. కృష్ణ చిత్రాల్లోని విశేషాలు, సరికొత్త సాంకేతికతను తెలుగు చలనచిత్ర రంగానికి పరిచయం చేయడంలో ఆయన కీలకపాత్ర పోషించారని, కౌబాయి, జేంస్బాండ్ వంటి వినూత్న ప్రయోగాలకు వెనుకాడని కళాపిపాసి కృష్ణ అని కొనియాడారు. పెద్దిబోయిన జోగేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పంత్ర సునీల్, దుగ్గిరాల కిరణ, వెలగా శుభకర్, కోనేరు శ్రీనివాస్, నవీన్ యెర్నేని, డా.హరనాథ్ పొలిచెర్ల, గోగినేని శ్రీనివాస్, మంతెన వెంకట్, డా.శివాజి, చెంచురెడ్డి, సత్యం నెరుసు, బచ్చు సుధీర్, జయ్ గుబ్బల, డా.రాజేంద్ర, వంశీ తదితరులు పాల్గొన్నారు. తెలుగు సినీప్రేమికులు ఈ కార్యక్రమంలో పెద్దసంఖ్యలో పాల్గొని కృష్ణకు నివాళి అర్పించారు.