బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్టబుపైప్రశంసల వర్షం కురిపించారు. తరచూ వివాదాల్లో వార్తల్లో నిలిచే ఆమె మరోసారి బాలీవుడ్ సినిమాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలను టబు బతికిస్తోందని చెప్పుకొచ్చింది. ‘‘బాలీవుడ్లో విడుదలైన రెండు చిత్రాలు మాత్రమే ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. వాటిలో ‘భూల్ భూలయ్య2’, రెండోది ‘దృశ్యం2. ఈ రెండు చిత్రాల్లోనూ టబు ప్రధాన పాత్ర పోషించారు. 50 ఏళ్ల వయసులోనూ సింగిల్ హ్యాండ్తో హిందీ చిత్ర పరిశ్రమను కాపాడుతోంది. తన చక్కని నటనతో వయసుతో సంబంధం లేకుండా స్టార్గా నిలవడం గొప్ప విషయం. మహిళలు వాళ్లు చేేస పనిపై విశ్వాసంతో ఉంటారు. అలాంటి వారు ఇంకా ఎక్కువ ప్రశంసలు పొందడానికి అర్హులు. టబు ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు’’ అని ఇన్స్టా స్టోరీలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం కంగనా రనౌత్ కథానాయికగా ‘ఎమర్జెన్సీ’ చిత్రంలో నటిస్తోంది. ఇందులో ఆమె ఇందిరా గాంధీగా కనిపిస్తారు. ఈ సినిమాకు ఆమె దర్శకనిర్మాతగా వ్యవహరించడం విశేషం.