NRI-NRT

హ్యూస్టన్‌లో విజయవంతంగా ముగిసిన నాట్స్ టెన్నీస్ టోర్నమెంట్

Auto Draft

తెలుగు వాళ్ల కోసం అమెరికాలో అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్) తాజాగా బాల, బాలికల్లో క్రీడా స్ఫూర్తిని నింపేందుకు టెన్నీస్ టోర్నమెంట్‌ను నిర్వహించింది. నాట్స్ హ్యూస్టన్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన యూత్ సింగిల్స్ టెన్నీస్ టోర్నమెంట్‌కు మంచి స్పందన లభించింది. స్థానికంగా ఉండే తెలుగు వాళ్లు ఈ టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు ఉత్సాహంగా ముందుకొచ్చారు. నాట్స్ హ్యూస్టన్ సహ సమన్వయకర్త చంద్ర తెర్లీ, నాట్స్ క్రీడా సమన్వయకర్త ఆదిత్య దామెర నేతృత్వంలో ఈ టోర్నెమెంట్ జరిగింది.

నాట్స్ హ్యూస్టన్ సమన్వయకర్త విజయ్ దొంతరాజు, నాట్స్ నాయకులు సునీల్ పాలేరు, సుమిత్ అరిగెపూడి, శ్రీనివాస్ కాకుమాను, వీరు కంకటాల, వంశీ తాతినేని తదితరులు ఈ టోర్నెమెంట్ విజయవంతం కావడానికి కృషి చేశారు. హ్యూస్టన్, గ్రేటర్ హ్యూస్టన్ ప్రాంతంలోని తెలుగు వారందరికీ నాట్స్ ఎప్పుడూ అండగా ఉండి సహాయ సహకారాలను అందిస్తుందని నాట్స్ బోర్డు సభ్యులు సునీల్ పాలేరు ఈ సందర్భంగా అన్నారు. చక్కటి సమన్వయంతో, క్రీడా స్ఫూర్తితో, ఎక్కడ ఏ విధమైన ఇబ్బందులు లేకుండా పోటీలు నిర్వహించిన నాట్స్ హ్యూస్టన్ విభాగానికి నాట్స్ కేంద్ర కమిటీ సభ్యులు, కోశాధికారి హేమంత్ కొల్ల అభినందలు తెలిపారు. క్రీడా నైపుణ్యత ఆధారంగా రెండు విభాగాల్లో జరిగిన ఈ పోటీల్లో ప్రతిభ చూపిన క్రీడాకారులకు నాట్స్ ట్రోఫీలను అందజేసి సత్కరించింది. తెలుగు వాళ్లలో మరింత ఉత్సాహం నింపేందుకు టోర్నమెంట్స్ ఏర్పాటు చేయడంపై నాట్స్ చైర్ ఉమెన్ అరుణ గంటి, నాట్స్ ప్రెసిడెంట్ బాపయ్య చౌదరి(బాపు)నూతి నాట్స్ హ్యూస్టన్ విభాగాన్ని ప్రశంసించారు.