Movies

ఆయనకు అర్థమయ్యేలా చెప్పాలి

ఆయనకు అర్థమయ్యేలా చెప్పాలి

దాదాపు ప్రతి సెలబ్రిటీకి సోషల్‌ మీడియాలో ట్రోలర్స్‌ బెడద తప్పడం లేదు. తారల పబ్లిక్‌ లైఫ్‌లో ఏ సందర్భం దొరుకుతుందా..దాన్ని విమర్శిద్దామా అన్నట్లు ట్రోలర్స్‌ వేచి చూస్తుంటారు. ఇటీవల తన సినిమా ‘దృశ్యం 2’ ప్రచార కార్యక్రమంలో నాయిక శ్రియాను ఆమె భర్త వేదిక మీదే ముద్దు పెట్టుకున్నాడు. దీనిపై సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ మొదలైంది. ట్రోలింగ్‌పై శ్రియా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. ఆమె స్పందిస్తూ…‘ఇందులో విమర్శించేందుకు ఏముందో అర్థం కావడం లేదు. నా భర్త నన్ను ముద్దు పెట్టుకోవడం ఎలా తప్పవుతుందో తెలియడం లేదు.ముద్దును కూడా విడ్డూరంగా చూసే వాళ్లు ఈ తరంలోనూ ఉన్నారంటే ఆశ్చర్యంగా ఉంది. ఏమైనా విమర్శించడం వారి పని, దాన్ని చూసీ చూడనట్లు వదిలేయడం నా పని. ఎవరేమనుకున్నా నా మనసుకు నచ్చిన పని చేసుకుంటూ వెళ్తాను. మా ఆయనకు నేను నటించిన సినిమాలు ఇష్టం. ఆయన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘దృశ్యం 2’ చిత్రాలు చూశారు. భాష రాకపోవడం వల్ల ఒకటికి రెండు సార్లు సినిమాలు చూస్తే గానీ అర్థం కావని నాతో చెబుతుంటారు. ఈ కథా కథనాలను ఆయనకు అర్థమయ్యేలా చెబుతుంటాను’ అని చెప్పింది. రష్యాకు చెందిన ఆండ్రీ కొశ్చీవ్‌ను శ్రియా 2018లో వివాహం చేసుకున్నారు.