Politics

వైఎస్ షర్మిలకు తెలంగాణ విద్యార్థుల వార్నింగ్

వైఎస్ షర్మిలకు తెలంగాణ విద్యార్థుల వార్నింగ్

వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపాన్ని తాకడంపై తెరాస శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు.. తెరాస ఓయూ విద్యార్థి విభాగం నాయకులు అమరవీరుల స్తూపాన్ని పసుపుతో శుద్ధిచేసి పాలాభిషేకం చేశారు.. తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి తెలంగాణ రాకుండా అడ్డుకున్నారని ఇప్పుడు తన కూతురు షర్మిల తెలంగాణపై మళ్ళి కుట్రలు చేసేందుకు పాల్పడుతున్నారని విద్యార్థి సంఘం నాయకులు మండిపడ్డారు.. వందలాది మంది విద్యార్థుల బలిదానానికి కారకుడైన వైయస్ రాజశేఖర్ రెడ్డి కూతురుగా తెలంగాణలో తిరిగే హక్కు లేదని… తిరుగుతే మాత్రం తరిమికొడతామని హెచ్చరించారు.. ఇప్పటికైనా నోరు అదుపు పెట్టుకొని ముఖ్యమంత్రి, ప్రజా ప్రతినిధులపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.