DailyDose

TNI నేటి నేర వార్తలు..

TNI నేటి నేర వార్తలు..

పత్రిక ప్రకటన
చిత్తూరు జిల్లాలో నకిలీ హోం గార్డ్ నియామకాల పై చిత్తూర్ జిల్లా ఎస్.పి. శ్రీ. వై. రిశాంత్ రెడ్డి ఐ.పి.ఎస్., గారి ఆదేశాల మేరకు చిత్తూర్ వన్ టౌన్ పి.యస్ నందు Cr.No.185/2022 U/s 420, 419, 409, 468, 471 r/w 120 –B IPC కేసు నమోదు చేసి డి. ఎస్.పి. గారి పర్యవేక్షణలో చిత్తూర్ ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీ. నరసింహరాజు గారు మరియు SI లు సిబ్బంది దర్యాప్తు చేసి ప్రాధమికంగా 7 మందిని అరెస్ట్ చేయడం జరిగింది.
విచారణ లోని అంశాలు
హోం గార్డ్ వింగ్ రెండు విధాలు అనగా L & O మరియు On payment విభాగములు. లా అండ్ ఆర్డర్ డ్యూటీ డైరెక్ట్ గా sp గారి కంట్రోల్ లో DPO ద్వారా వారి సాలరీ లు నేరుగా జమచేయడ౦ జరుగుతుంది. ఆన్ పేమెంట్ బేసిస్ మీద వివిధ రకాల 9 శాఖలకు sp గారు నియామకాలు చేసి హో౦ గార్డ్స్ ను కేటాయిస్తారు. i.e. 1. APSRTC, 2. FAIR, 3. KANIPAKAM TEMPLE, 4. RPF, 5. TTD, 6. RTA, 7. PRISONS DEPARTMENT, 8. APSPDCL, 9. FCI డిపార్టుమెంట్ ల నుంచి సాలరీ లు డైరెక్ట్ గా హోం గార్డ్స్ అకౌంటు కి సాలరీ జమ చేయబడుతు౦ది.

పైన తెలిపిన 9 , డిపార్టుమెంట్ లు వారి వారి శాఖలో on payment పై గల హోం గార్డ్ పోస్టల ఖాళీలను భర్తీ చేయడానికి SP గారికి వినతి పత్రము ఇస్తారు. దాని మేరకు SP గారు తన పరిధిలోని హోం గార్డ్స్ ని పూర్తి గా, పాక్షికంగా గాని కోరిన డిపార్టుమెంట్ ల పంపిస్తూ ఉంటారు.
On payment పై హోం గార్డ్ లు పంపిచే వివిధ శాఖలలో ఖాళీలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకొని హోం గార్డ్ writer గా పనిచేసిన హోం గార్డ్ మణికంటన్, హోంగార్డు ఇంచార్జీ కానిస్టేబుల్ జయకుమార్, DPO లో హోం గార్డ్ గుమస్తా సహాయకుడిగా పనిచేసిన హోంగార్డు కిరణ్ కుమార్, కలిసి ఎలాగైనా అక్రమ మార్గ౦లొ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యం తో వారి కి పరిచయము ఉన్న వారి ద్వారా నిరుద్యోగులైనా యువత నుండి 2 లక్షల నుంచి 5 లక్షల వరకు డబ్బులు వసూలు చేసి హోం గార్డ్ ఉద్యోగాలు తీసి ఇస్తామని మాయ మాటలు చెప్పి వారిని నమ్మించి నకిలీ డ్యూటీ పత్రాలు సృష్టి౦చి వివిధ శాఖలకు వారి డ్యూటీ టికెట్ ఇచ్చి పంపించేవారు. ఈ విధంగా 2014 నుండి 2019 వరకు సుమారుగా 87 మంది ని వివిధ శాఖలలో హోం గార్డ్ గా పంపి౦చినారు.

2014 2015 2016 2017 2018 2019 Total
12 15 15 25 11 9 87

సదరు విషయముగా చిత్తూరు వన్ టౌన్ Cr.No.185/2022 U/s 420, 419, 409, 468, 471 r/w 120 –B IPC కేసులో లోతుగా దర్యాప్తు చేసి వివిధ శాఖలలో గల ఫేక్ హోం గార్డ్ నియామకం అయిన వారి వివరాలు సేకరి౦చడ౦ జరిగి౦ది. ఇందులో 7 మందిని ప్రాధమిక౦గా అరెస్టు చేయడము జరిగింది మరియు ఇతరుల యొక్క పాత్రకు సంబందిచి విచారణ కొనసాగుతోందని చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ వై.రిశాంత్ రెడ్డి, IPS గారు ఒక ప్రకటన లో తెలిపారు.

ముద్దాయిల వివరాలు :
1. R.మణిగండన్, వయస్సు 39 సం.లు, తండ్రి: లేట్ D.రామలింగం, మురకంబట్టు లోని ఓల్డ్ స్ట్రీట్, చిత్తూరు టౌన్,
2. T. యువరాజ్, వయస్సు 38 సం.లు, తండ్రి: కుప్పయ్య, D.No. 4-2/109 A, గిరింపేట వోటి చెరువు, చిత్తూరు టౌన్,
3. B. R. కిరణ్ కుమార్, వయసు 40 సంవత్సరము లు , తండ్రి పేరు లేట్ B. R. రామచంద్రయ్య, D.No. 24-354/2A, భరత్ నగర్, C.G. పల్లి పోస్టు, చిత్తూరు మండలం.
4. N. జయకుమార్, వయసు 51 సంవత్సరము లు, తండ్రి పేరు లేట్ M. కృష్ణమూర్తి, D.No. 1-18, మొగిలి వెంకటగిరి పోస్ట్ & గ్రామము, బంగారుపాళ్యం మండలం.
5. D.సుల్తాన్, వయస్సు 34 సం.లు, తండ్రి: కరీం సాహెబ్, D.No.28-1334/1A, న్యూ బాలాజీ కాలనీ, చిత్తూరు టౌన్
6. సలీం బాష, వయస్సు 30 సం.లు, తండ్రి: షాదుల్లా సాహెబ్, D.No. 25-115, వల్లియప్పనగర్, గిరింపేట, చిత్తూరు టౌన్,
7. చిరంజీవి, వయస్సు 36 సం.లు, తండ్రి: లేట్ గోపి, D.No. 2-28 కలవగుంట, పెనుమూరు, చిత్తూరు జిల్లా.

***********************************

🔥బ్రేకింగ్ న్యూస్….

హైదరాబాద్-విజయవాడ నేషనల్ హైవే పై రోడ్డుప్రమాదం….

నకిరేకల్ శివారులో నర్సింగ్ విద్యార్థులతో వెళ్తున్న బస్సు బోల్తా…..

సుమారు 20 మంది విద్యార్థులకు తీవ్రగాయాలు….

క్షతగాత్రులను ఆస్పత్రికి తరలింపు…

భాదితులు సూర్యాపేట పీజీఎఫ్ నర్సింగ్ కళాశాల విద్యార్థులు…

నల్గొండకు వెళ్తుండగా ఘటన…

బస్సు ఫిట్ నెస్ లేకపోవడమే ప్రమాదానికి కారణమని అనుమానం…

ఘటనపై కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు….

****************************************

◼️ || భూమిలో పాతిపెట్టిన తుపాకీలు, బుల్లెట్లను బీఎస్‌ఎఫ్‌ దళాలు స్వాధీనం || ◼️

భూమిలో పాతిపెట్టిన తుపాకీలు, బుల్లెట్లను బీఎస్‌ఎఫ్‌ దళాలు గుర్తించి స్వాధీనం చేసుకున్నాయి.

అనుమానాస్పద కదలికలను గుర్తించడానికి అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్న గ్రామాల్లో భద్రతా దళాలు పెట్రోలింగ్‌ నిర్వహిస్తూ ఉంటాయి.

పంజాబ్‌లోని ఫిరోజ్‌పుర్‌ జిల్లాలో ఉన్న చండీపుర్‌ వాలా గ్రామంలో ఈ తరహా తనిఖీలు చేస్తున్న సరిహద్దు భద్రతా దళం సిబ్బంది అప్పుడే తవ్వి పూడ్చిన ఓ ప్రాంతాన్ని గుర్తించారు.

అనుమానం వచ్చి పరిశీలించగా అందులో ఆయుధాలను దాచిపెట్టినట్లు కనుగొన్నారు.

అక్కడ బయటపడిన వాటిలో రెండు ఏకే 47 తుపాకులు, రెండు పిస్తోళ్లు, 40 బుల్లెట్లు ఉన్నట్లు సీనియర్‌ భద్రతాధికారి ఒకరు తెలిపారు.

******************************************
స్పందన టోల్ ప్రీ నంబర్లు

1902: నవరత్నాలు పథకాలతో సహా అన్ని రకాల ఫిర్యాదులకు
14500: ఇసుక, ఎక్సైజ్ విభాగంపై ఫిర్యాదులకు
14400:అధికారుల అవినీతిపై ఫిర్యాదులకు
1907:వ్యవసాయ రంగం, రైతు భరోసాకు సంబంధించిన ఫిర్యాదులు
14417: పాఠశాలల్లో జగనన్న గోరు ముద్ద, జగనన్న విద్యాకానుక, నాడు నేడు పనులు, టాయిలెట్ల నిర్వహణ, టీచర్ల హాజరుపై ఫిర్యాదులకు..

***********************

భారత జర్నలిజంలో చీకటి యుగం
రవీష్ కుమార్

(రవీష్ కుమార్ అత్యంత గౌరవనీయమైన భారత జర్నలిస్టు.ఆయన 1996లో ఎన్ డి టి వి లో చేరి, రవీష్ కీ రిపోర్ట్,దేశ్ కీ బాత్,ప్రైమ్ టైమ్ విత్ రవీష్ వంటి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. ఆసియాలో కెల్లా సంపన్నుడూ, భారత ప్రధాని నరేంద్ర మోడీకి సన్నిహితుడూ అయిన గౌతమ్ అదానీ ఎన్ డి టి వి ని కొనివేయబోతున్నాడనే వార్త వెలువడిన కొద్ది గంటల్లోనే రవీష్ కుమార్ తాను ఎన్ డి టి వి కి రాజీనామా చేస్తున్నానని తన యూట్యూబ్ చానల్ మీద ప్రకటించారు.ఆ రాజీనామా సందర్భంగా 2022 డిసెంబర్ 1న ఆయన ఇచ్చిన ఉపన్యాస పాఠానికి అనువాదం)

భారత జర్నలిజంలో స్వర్ణయుగం అనబడేదేదీ లేదు. కాని పరిస్థితి ఇవాళ ఉన్నంత ఘోరంగా మరెప్పుడూ లేదు.జర్నలిజం లోని ప్రతి ఒక్క మంచి అంశాన్నీ వేగంగా ధ్వంసం చేస్తున్నారు.ఇది ఊహించినదే. కాని, ఇవాళ వాస్తవంగా నడుస్తున్నది జర్నలిజంలో ‘చీకటి యుగం’.దేశంలో లెక్కలేనన్ని వార్తా చానళ్లు ఉన్నాయి కాని అన్నిటికన్నీ నీతి తప్పి ఉన్నాయి. మన ప్రచారమాధ్యమాల పర్యావరణమే కుప్పకూలిపోయి,ధ్వంసమైపోయి ఉన్నది.

ఇవాళ ప్రతి ఒక్కరూ తనను తాను జర్నలిస్టుననే చెప్పుకుంటున్నారు.మరీ ముఖ్యంగా అధికారబలం ఉన్నవారికి సన్నిహితంగా ఉన్నవారు,లేదా వారితో ఉన్నవారు.ఈ దేశంలో జర్నలిజం అణగిపోవడానికి అసలైన కారణం ఈ జర్నలిస్టుల ముఖాలూ, వారి సంస్థలూ కావడం ఒక వైచిత్రి.వాళ్లు తామే మంచి జర్నలిజాన్ని తెస్తున్నామని కూడ చెప్పుకుంటున్నారు.వారి పట్ల జాగ్రత్తగా, అనుమానంగా ఉండమని నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను.ప్రశ్నలే లేని ఈ జర్నలిస్టులూ,చివరికి ప్రభుత్వమూ కూడ జర్నలిజం గురించి వారి నిర్వచనాన్నే మీ గొంతుల్లోకి తోయడానికి ప్రయత్నిస్తున్నారు.

ఎన్ డి టి వి తో నా జ్ఞాపకాలు

ఈ దశలో నేను ఇంతకాలమూ పనిచేసిన సంస్థ గురించి మాట్లాడదలచుకోలేదు. ఎందుకంటే భావోద్వేగంతో ఉన్నప్పుడు వస్తుగతంగా ఉండడం సాధ్యం కాదు.వాస్తవాలమీద భావోద్వేగాలదే పైచేయి అవుతుంది. కనుక భావోద్వేగాలను పక్కన పెడదాం.

ఎన్ డి టి వి తో నాకు ఆసక్తికరమైన జ్ఞాపకాలెన్నో ఉన్నాయి.ఎవరో ఒక వ్యక్తికి కృతజ్ఞతలు చెప్పడం చాల కష్టం.మీ వృత్తిపరమైన ప్రయాణానికి ఎందరెందరో దోహదం చేసినప్పుడు,ఎవరో ఒకరికే కృతజ్ఞతలు ఎలా చెప్పగలరు? గతంలో పనిచేసిన, ప్రస్తుతం పనిచేస్తున్న సహోద్యోగులు ఎంతో మంది తమలోని ఒక భాగాన్ని నాలో చూస్తారని నాకు తెలుసు.అది సరైనదే కూడ.అలాగే నేను ప్రతి ఒక్కరినుంచీ ఎంతో కొంత తీసుకున్నాను. అందుకు కృతజ్ఞుణ్ని.

పెళ్లికూతురు పుట్టింటి నుంచి వెళ్లిపోయేటప్పుడు ఆ కన్న ఇంటి కోసం విలపిస్తుంది.మరొక ఇంటికి వెళ్లిపోయాక కూడ కన్న ఇంటిని గుర్తు చేసుకుంటుంది.ఇవాళ నేను ఆ పెళ్లికూతురిలా ఉన్నాను.బహుశా అటువంటి అనుభూతిలో మునిగిపోయే క్షణం ఇది.భవిష్యత్తులో ఎప్పుడైనా అటువంటి భావోద్వేగం లేని సమతాస్థితిలో ఎన్ డి టి వి గురించి మాట్లాడతాను.

ఒక టివి ని నిర్మించేది బృందాలే అని ఎన్ డి టి వి నాకు నేర్పింది.యాంకర్లకు ప్రాధాన్యత పెరిగిపోయి వాళ్లు స్టార్లు గా మారాక,ఈ భావన కొంత దెబ్బతిన్నది.అయినా,మీ బృందం ఎంత మంచిదైతే మీ పని అంత మంచిదవుతుందని ఇవాళ కూడ నేను నమ్ముతున్నాను.

ఎన్ డి టి వి లో అనువాదకుడిగా లాంఛనంగా 1996 ఆగస్ట్ లో చేరాను.కాని అంతకు ముందు కూడ,ఎన్ డి టి వి లో వీక్షకులు రాసిన చేతి రాత ఉత్తరాలు చదివే పని చేసేవాణ్ని.ఆ ఉత్తరాలు వేరు వేరు కార్యక్రమాల మీద ఆయా యాంకర్లను ఉద్దేశించి ఉండేవి.ఆ ఉత్తరాలు చదువుతున్నప్పుడే దేశంలో టివి వీక్షకులు ఎలా తయారవుతున్నారో నాకు తెలిసింది. ఆ ఉత్తరాలు చదివి,వాటి ఆధారంగా నివేదికలు తయారుచేసి ఆయా కార్యక్రమాల నిర్మాతలకు ఇవ్వడం నా పని.అప్పుడు నేను ఒక రోజు కూలీని.నాకు అట్లాగే లెక్కకట్టి డబ్బులు ఇచ్చేవారు.

వీక్షకుల పట్ల నిజాయితీగా ఉండడం

నేను ఇప్పటికీ అటువంటి పనే చేస్తున్నానను కుంటాను.ఇవాళ కూడ,వేలాది మంది నాకు రాస్తుంటారు.ఇప్పటికీ మీలో కొందరి నుంచి చేతిరాత ఉత్తరాలే అందుకుంటాను.వాటిలో చాల ఉత్తరాలను నేను చదువుతాను,వీలైనన్ని ఎక్కువ ఉత్తరాలకు జవాబిస్తాను.మీ ముందర నన్ను నేను బహిరంగ పరచుకుంటాను.మీ గురించి నేనేమనుకుంటానో నిజాయితీగా చెప్పదలచాను.నేను నా ఆలోచనలను కత్తిరించుకుంటే,అది మీ పట్ల నిజాయితీగా లేకపోవడం అవుతుంది.ఒక రకంగా నేను పూర్తి చక్రం తిరిగివచ్చాననుకుంటాను.వీక్షకుల అభిప్రాయాల ఉత్తరాలు ఒకప్పుడు చదువుతుండేవాణ్ని,ఇప్పుడూ చదువుతున్నాను.

మీ అందరి సలహాలు, ప్రతిస్పందనలు, ఆశలు, విమర్శలు, అప్పుడప్పుడు నిందలు మధ్యనే నా జీవితమంతా సాగింది. అదే నన్ను మీకు చాల దగ్గర చేసింది. నేను మీ మధ్య ఉన్నప్పుడు, నిజంగా నేను నా కోసం జీవించలేదు. ఇప్పుడు, నాకు అందుకు సమయం దొరుకుతుందని నా ఆశ.

ఎవరో లాగేసినందువల్ల గూడు కోల్పోయిన పక్షి లాగుంది నా పరిస్థితి. కాని పక్షికి ఇప్పుడింకా ఎగరడానికి విశాల ఆకాశం ఉంది.

నేను విలేఖరులు రాసిన నివేదికలనూ కథనాలనూ ఇంగ్లిష్ నుంచి హిందీలోకి అనువాదం చేస్తుండేవాణ్ని. ఆ తర్వాత నేనే విలేఖరినయ్యాను.రవీష్ కీ రిపోర్ట్ అనే అనుదిన కార్యక్రమ నిర్మాతనయ్యాను.

ఉత్తరాలు చదివే పనిలో చేరిన మనిషి గ్రూప్ ఎడిటర్ అయ్యాడు.అది కేవలం ఎన్ డి టి వి లోనే సాధ్యం. ఇవాళ ఆ మనిషి తన రాజీనామా సమర్పిస్తున్నాడు.

ఈ సంస్థ వెనుక దారాలు లాగే శక్తిమంతమైన మనుషులెందరో ఉన్నారు.అందువల్ల ఇటువంటి రోజొకటి వస్తుందనేది నిశ్చయమే.కాని ఇప్పుడు ఆ రోజు వచ్చేసరికి, అది విచారకరంగా అనిపిస్తున్నది.

నన్ను అంచనా కట్టేటప్పుడు,చాల కింది స్థాయిలో ప్రారంభించానని నా మీద జాలిపడరనే ఆశిస్తాను. చాల కింది స్థాయిలో ప్రారంభించామని చెప్పి సానుభూతి సంపాదించేవాణ్ని కాను నేను. అటువంటివాళ్లు తాను ఎట్లా ఒక చిన్న చాయ్ దుకాణంలో బాల్యం గడిపానో అని హఠాత్తుగా చెపుతుంటారు.అదే సమయంలో అత్యంత ఖరీదైన విమానాల్లో ప్రయాణిస్తుంటారు.నా జీవన ప్రయాణం ఏదో అసాధారణమైనదని నేను అనుకోను.ఈ దేశంలో ప్రతి ఒక్కరిదీ కష్టభరితమైన జీవితమే. ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ఉన్న రోగుల కుటుంబాలతో మాట్లాడి చూడండి. వాళ్లు ఎన్నెన్ని కొండగుట్టలు ఎక్కి అక్కడికి చేరారో ఊహించడం కూడ సాధ్యం కాదు. వాళ్లతో పోలిస్తే మన కష్టాలు పిపీలికాలు.

“నేను మీ కోసం పనిచెయ్యడానికి ప్రయత్నించాను”

ఇవాళ నేను మీతో టివి వీక్షకుల గురించి మాట్లాడదలచాను. వ్యవస్థలూ నిర్మాణాలూ పడిపోవడమూ, సమాజాలను విద్వేష కెరటాలు ముంచెత్తడమూ ఇటీవల మనందరమూ చూస్తున్నాం.కాని ఒక కొత్త వ్యవస్థ రూపు దిద్దుకోవడం నేను కళ్లారా చూశాను.ఆ వ్యవస్థ పేరు పౌరసత్వం.ఎన్ డి టి వి నాకొక అవకాశం ఇచ్చినప్పుడల్లా నేను మీ కోసమే పని చెయ్యడానికి ప్రయత్నించాను.నాకు అందిన అవకాశాన్ని మీ కథలతోనే నింపాను.

మీరు నామీద పెద్ద బాధ్యత పెట్టారు. మీరు మీ ఇళ్లలో, మీ మనసుల్లో నాకోసం ఒక న్యూస్ రూం నిర్మించారు.ప్రపంచవ్యాప్తంగా వీక్షకులు నాకు సహాయపడడానికి ముందుకొచ్చారు.మీరు నన్ను డబ్బు అడగలేదు. మీ కోసం ఏదో సహాయం చేయమని అడగలేదు.చాలమంది నా వీడియోలు రికార్డ్ చేసి పెట్టారు,నా పరిశోధనలో సహకరించారు. నా కార్యక్రమాలలో ప్రతి ఒక్కటీ మీ సహకారానికి ఒక వ్యక్తీకరణ.మీరే నాకు సమాచారం అందించారు, నా పొరపాట్లకు మందలించారు, నా కార్యక్రమాల్లో భాగమయ్యారు.

నిపుణులు,విద్యార్థులు,ప్రవాసులు,భారతీయులు అందరూ వీక్షకులే.కాని నా సహప్రయాణికులయ్యారు,తమంతట తామే జర్నలిస్టులయ్యారు.ఆవిధంగా వాళ్లు జర్నలిజం అనే ఒక చిన్న ద్వీపాన్ని పరిరక్షించారు.

ఆ అర్థంలో నేను టివి వీక్షకుల సముదాయం తయారు కావడమూ చూశాను, అది పూర్తిగా విచ్ఛిన్నమైపోవడమూ చూశాను. ఇప్పుడు, ఆ సముదాయం ఒక వ్యవస్థగా లేచి నిలవడం చూస్తున్నాను.

మీరు నా కృషిని విభిన్నమైన భాషలలోకి అనువదించారు. నాకు కావలసిన వనరులు ఎప్పుడూ అందుబాటులో ఉండేవి కావు, కాని మీరే వాటిని నాకు అందుబాటులోకి తెచ్చాను. నిజానికి నేను నడిపిన కార్యక్రమం ప్రైమ్ టైమ్ మీ ప్రైమ్ టైమే. ఆ కార్యక్రమంలో ఎప్పుడన్నా కొరత కనబడితే, వెనువెంటనే మీ అసంతృప్తి ప్రదర్శించేవారు. వీక్షకులే నాకు ఎల్లవేళలా సంపాదకులు. ఒక మనిషంటే అతని చుట్టూ ఉన్న మనుషుల సమాహారమే అని నేను ఎప్పుడూ అంటుంటాను. వీక్షకులుగా మీరు ఉన్నందువల్లనే రవీష్ కుమార్ ఇవాళ ఇక్కడ నిలబడి ఉన్నాడు.

మీ మద్దతు వల్లనే ఎంతోమంది జర్నలిస్టులు యూట్యూబ్ మీద,ట్విట్టర్ మీద ఉండగలుగు తున్నారు.మీరు వెబ్ సైట్లకు చందాదారు లయ్యారంటే,అవి నిలబడి ఉండడానికి సహాయ పడుతున్నారన్నమాట.

జర్నలిస్టులకు వీక్షకులెట్లా సహకరిస్తారు

ప్రజాస్వామిక వ్యవస్థలు బలహీనపడినప్పుడు, న్యాయస్థానాలు కూడ బలహీనపడినట్టు కనబడి నప్పుడు,బలోపేతంగా నిలబడినది మీరే.ఇవాళ్టి పరిస్థితులలో జర్నలిజపు అతి పెద్ద వ్యవస్థ మీరే. ఇవాళ జర్నలిజం వివేకవంతులైన వీక్షకులలోనే జీవిస్తున్నది, బ్రహ్మాండమైన భవనాల్లో, సంస్థల్లో కాదు.ఈ కాలంలో మీరు చేస్తున్న అతి పెద్ద సహాయం ఏమంటే,మీరు కఠినమైన ప్రశ్నలు అడిగే జర్నలిస్టుల పక్కన నిలబడుతున్నారు.

ప్రజల గొంతును నొక్కేసే శక్తులుండవచ్చు.ప్రజల గొంతును మత విద్వేషంతో నింపే,ప్రజాస్వామ్యాన్ని హత్య చేసే శక్తులుండవచ్చు.కాని మీలో కొందరు నాలో ఆశలు రేకెత్తిస్తున్నారు.ఎందుకంటే, ప్రజాస్వామ్యమనేది చచ్చిపోయినప్పటికీ, సవ్యంగా సాగే ప్రజాస్వామ్యం ఉండాలనే కోరిక మిగిలే ఉంటుంది.అదంతా మీ వంటి బాధ్యతాయుత వీక్షకుల వల్లనే.

ఈ కష్ట సమయంలో,అభిమానతో నా బుగ్గలు పిండిన వృద్ధ స్త్రీలను కృతజ్ఞతతో తలచుకుంటున్నాను.నాకు మొక్కల కుండీలు కానుకలుగా ఇచ్చిన వాళ్లను, నేను ఆరోగ్యంగా ఉండాలని బలవర్ధక ఆహారం అందించినవాళ్లను కృతజ్ఞతతో తలచుకుంటున్నాను.మండుటెండల్లో పని చేస్తున్నప్పుడు నా మీద నీడగా గొడుగులు పట్టుకున్న వాళ్లున్నారు.గుట్టుచప్పుడు కాకుండా నా జేబులోకి ఖరీదైన కలాలను తోసినవాళ్లున్నారు.

అందువల్లనే ఇవాళ నాకు మీ అందరినీ తలచుకోవాలనిపిస్తున్నది.మీరందరూ లేకపోతే నేననేవాణ్ని ఉండేవాణ్ని కాదు.మీరందరూ నాకు గర్వకారణం.చాలసార్లు నాకు ఉద్యోగం ఇచ్చిన సంస్థ ప్రతినిధిని కాననీ, మీ ప్రతినిధినేననీ అనిపించింది.

నాకు పని చేసుకోవడానికి అవధులు లేని స్వేచ్ఛ లభించింది.నా జీవితమే దాని మీద ఆధారపడినట్టుగా నేనా స్వేచ్ఛను కాపాడుకున్నాను. ఆ సమయంలో మీరు, విజ్ఞులైన వీక్షకులు నన్ను పరీక్షిస్తున్నారని నాకు తెలుసు.ఏ పొరపాటూ చేయకుండా ఉండడానికీ, అహంకారాన్ని దరిచేరనీయకుండా ఉండడానికీ జాగ్రత్తలు తీసుకున్నాను.అహంకారం వచ్చిందంటే నా స్వేచ్ఛను కోల్పోతానని నాకు తెలుసు.నా కళ్ల ముందే ప్రపంచం మారిపోతూ ఉండగా, టెస్ట్ మాచ్ లో బాట్స్ మన్ లాగ నేను రేఖ మీదనే నిలబడ్డాను.కాని హఠాత్తుగా ఎవరో అసలు మాచ్ నే ముగించారు,ఆట నియమాలను మార్చేశారు.

వీక్షకుల మీద ఇష్టారాజ్యంగా స్వారీ చేసేవాళ్లు ప్రతి దేశంలోనూ ఉంటారు.భారతదేశంలో కూడ ఉన్నారు. వాళ్లు మీకు వాస్తవాలే ఇస్తున్నామని నమ్మబలికితే అర్థమేమంటే,డాలర్లకు డాలర్లు తమ జేబుల్లో వేసుకుంటూ మీకు చిల్లర సెంట్లు విసురుతున్నా రన్నమాట.వాళ్ల తప్పులను బహిర్గతం చేయడానికి జర్నలిస్టులో,వార్తాసంస్థలో ప్రయత్నిస్తే, వారి మీద లెక్కలేనన్ని కేసులు బనాయిస్తారు.మళ్లీ వాళ్లే అర్థవంతమైన జర్నలిజమంటే తమకు అమిత ఆసక్తి అని గంభీరంగా చెపుతుంటారు.

హిందీ జర్నలిజం అవసరం

హిందీలో పనిచేసే అద్భుతమైన జర్నలిస్టులెందరో తమ అభిప్రాయాలను ప్రపంచంతో ఎందుకు పంచుకోరు? వాళ్ల పరిజ్ఞానం ఎంత లోతైనదో చూసి నేను ఆశ్చర్యపోయాను. కాని ఎప్పుడూ వారికి దక్కవలసిన స్థానం దక్కలేదు.

భారతదేశంలో అత్యధిక గౌరవం పొందే జర్నలిస్టులు ఇంగ్లిష్ మాధ్యమాలలో పనిచేసేవారే. అందువల్లనే నేను హిందీ జర్నలిజానికి గౌరవనీయత తేవడానికి ప్రయత్నించాను. ఈ భాషలో జర్నలిజం కూడ ముఖ్యమైనదేనని చూపాను. దేశం మొత్తం నుంచీ ప్రజలు నా హిందీని ప్రేమించేలా చేసేందుకు ప్రయత్నించాను. నిజానికి నా మాతృభాష హిందీ కాదు, భోజ్ పురి. నేను నా భోజ్ పురి కుగ్రామం నుంచి ఈ హిందీ మహానగరానికి నడిచివచ్చాను.

నా హిందీని సంపద్వంతం చేసిన దేశంలోని హిందీయేతర ప్రాంతాల ప్రజలందరికీ కృతజ్ఞతలు చెప్పదలచాను. వారు నా పనిని తమ భాషల్లోకి అనువదించారు. వారి రచనలను నాకోసం హిందీలోకి అనువదించారు!

నేనొక బిడారులో ప్రయాణిస్తున్నాననీ, ఈ ప్రయాణంలో ఎంతో మంది నాతో భుజం కలిపి నడిచారనీ నాకు తరచుగా అనిపిస్తుంటుంది. ఇదేమీ హిందీ, ఇంగ్లిష్ జర్నలిజాల మధ్య కుస్తీ పోటీలా మారాలని నేను అనుకోవడం లేదు. అందువల్ల నా జీవితంలో ఇంగ్లిష్ భాషా జర్నలిస్టులు చేసిన ఎన్నెన్నో సహకారాలను కూడ తలచుకోవాలి.

జర్నలిస్టులు ఏం చేయవలసి ఉంది

వీక్షకులతో సమయం పంచుకున్నప్పుడల్లా, జర్నలిస్టుల పట్ల మీ విశ్వాసాన్నీ, సమస్యల పట్ల మీ లోతైన అవగాహనలనూ చూసి నేను ముగ్ధుడి నయ్యాను.మీ దగ్గర చెప్పవలసింది ఎంతో ఉంది. నిజానికి అదంతా వినడం ప్రభుత్వ బాధ్యత.

మీ గళాన్ని అత్యున్నత స్థాయిల దాకా తీసుకుపోయే మాధ్యమంగా ఉండడమే జర్నలిస్టులు చేయవలసిన పని. ఈ దేశాన్ని మీ కళ్ల ద్వారా చూడడానికే నేను ఎల్లప్పుడూ ప్రయత్నించాను. మీ క్రియాశీలతే భారత ప్రజాస్వామ్యాన్ని సజీవంగా ఉంచుతుంది. షహీన్ బాగ్, రైతుల ఆందోళన మీలో నా విశ్వాసాన్ని ఇనుమడింపజేశాయి. మీరు బాధ్యతాయుత పౌరులుగా రూపాంతరం చెందుతుండడం నేను గమనించాను. మీరే భవిష్యత్తులో మెరుగైన సమాజాలను సృష్టించగలరు.

సమాజం లోని సమస్త రంగాలనూ తమ అదుపులో ఉంచుకోగలమని ఇవాళ కొందరు భావిస్తున్నారు. పౌరులను గడ్డిపోచల్లా తీసేయగలమని లెక్కలేకుండా ప్రవర్తిస్తున్నారు.ప్రచార మాధ్యమాలనేవి మరణించాయి.రాజకీయ ప్రతిపక్షం పెనుగు లాడుతున్నది.అదంతా నిజమే. కాని ఇటువంటి స్థితి శాశ్వతం కాదు.ఒకానొక రోజున ప్రజలు తమ విద్వేషాన్ని అధిగమిస్తారు.వారు ఒక కొత్త సమాజాన్ని నిర్మించడం గురించి ఆలోచిస్తారు.అప్పుడు వారు జర్నలిజం గురించి ఆలోచిస్తారు.నేను చదవడమూ, మాట్లాడడమూ,రాయడమూ ఎన్ డి టి వి దగ్గరే నేర్చుకున్నాను.మంచి దుస్తులు ధరించడం ఎట్లాగో, టై కట్టుకోవడం ఎట్లాగో ఎన్ డి టివి దగ్గరే నేర్చు కున్నాను.ఖాళీ సమయమే దొరకలేదు గనుక నాట్యం ఎలా చేయాలో మాత్రం నేర్చుకోలేకపోయాను.

మహిళా జర్నలిస్టుల దగ్గర నేర్చుకున్న పాఠాలు

నా మహిళా సహోద్యోగులను నేను ప్రత్యేకంగా తలచుకోదలచుకున్నాను.వాళ్లే నాకు నిజాయితీగా ఉండడం,కష్టపడి పని చేయడం,నీతిగా ఉండడం నేర్పారు.సామాజిక సమస్యల పట్ల నా అవగాహనలను వాళ్లు విశాలం చేశారు.ఎందరో స్త్రీల, బాలికల అనుభవాలు నా ప్రయాణంలో కలిసిపోయాయి. నా సహచరి, నా కూతుళ్లు, మా అమ్మ నాకు మద్దతు ఇచ్చారు. జర్నలిజంలో పురుషుల రాజ్యమే, పితృస్వామ్యమే నడుస్తున్నది. వారి దూకుడు ఇబ్బందికరంగా ఉండేది. అటువంటి దూకుడు సృజనాత్మకతనూ, ఆలోచననూ చంపేస్తుంది. అటువంటి దూకుడుకు పాల్పడకుండా నన్ను నా మహిళా సహోద్యోగులే కాపాడారు.

ఈ జర్నలిజం క్షేత్రంలో ఇప్పుడిప్పుడే అడుగు పెడుతున్నట్టయితే మీకు నా సలహా ఏమంటే ఎల్లప్పుడూ మీ మహిళా సహోద్యోగులతో మన్ననగా ఉండండి.వాళ్ల సామర్థ్యాన్ని అంగీకరించండి, గౌరవించండి.వాళ్లను ప్రశంసించండి.

నేను ప్రైమ్ టైమ్ యాంకర్ గా ఉన్న రోజుల్లో నా జీవితమంతా ఆ కార్యక్రమానికే ముడిపడి ఉండేది. టివి వార్తలతో నేను ప్రేమలో పడ్డాను.బహుశా అందువల్లనే ఇవాళ నా గుండె పగులుతున్నది కాబోలు. ఎన్ డి టి వి ఎర్ర మైక్రోఫోన్ ఎల్లవేళలా నా స్మృతిలో నిలిచే ఉంటుంది.

నేను మీ దినచర్యలో భాగమయ్యానని, మీరు నా గురించి ఆలోచిస్తుండేవారని నాకు తెలుసు. నిజానికి నేను మౌనంగా వెళిపోదామనుకున్నాను.అందుకే గత కొన్ని రోజులుగా ప్రైమ్ టైమ్ నుంచి తప్పుకున్నాను. మీ దినచర్య నుంచి నన్ను చెరిపెయ్యాలనుకున్నాను, మీరు నన్ను మరిచిపోయేలా చేయాలనుకున్నాను. కాని మీరు నన్ను ఆ పని చేయనివ్వలేదు.నేను ఎందుకు కనబడడం లేదని మీరు ప్రశ్నలు గుప్పించారు,నాకేమైనా అయ్యిందా అని అడిగారు, నా ఆరోగ్యం ఎలా ఉందని అడిగారు.

భారత దేశపు ప్రచారమాధ్యమాల స్థలం మారిపోయింది.జర్నలిస్టులుగా మారాలనే కోరికతో లక్షలాది రూపాయలు ఖర్చుపెట్టి చదువుకుంటున్న భారతీయ యువకులను తలచుకుంటే నా హృదయం ద్రవిస్తున్నది.ఎందుకంటే, వాళ్లు చివరికి భారత రాజ్యపు సేవకులుగా పని చేయవలసి వస్తుంది. నీతిమంతులైన జర్నలిస్టులు పని చేయడానికి ఏ ఒక్క సంస్థా మిగలలేదు.

ఇవాళ జర్నలిస్టులుగా ఉన్నవారందరూ కూడ అయితే ఊపిరిసలపని స్థితిలోనైనా ఉన్నారు, లేదా ఈ వృత్తినే వదిలేసి వెళ్లిపోయారు. జర్నలిజం అంటే నెల జీతం అందే ఒకానొక వృత్తే తప్ప మరేమీ కాదని నాకు ఎందరో చెప్పారు. జీతం మినహా జర్నలిజంలో ప్రోత్సాహకమైన ప్రేరణ ఏదీ లేదు.

పవిత్రమైన జర్నలిస్టు మృత పౌరప్రజానీకానికి బాధ్యత వహించాలి.కనుక నిర్భయంగా మాట్లాడండి. ఉట్టి పాదాలతో నడిచి మహా బలోపేతమైన బ్రిటిష్ పాలనను మట్టి కరిపించిన దేశపు పౌరులు మీరు.మిమ్మల్ని నమ్మకుండా ఉండడానికి కారణమే లేదు. అనైతికమైన మాధ్యమాల వార్తాసందేశాల సంకెళ్లను మీరు తెంచుకోగలరు. మీరు అందుకు పోరాడవలసి ఉంది. పోరాడకపోతే మీకు తలెత్తి నడిచే అవకాశమే లేదు. మీరు ఆ పోరాటం చేయకపోతే, మీరు ఒక స్వతంత్ర దేశపు పౌరులుగా ఉంటారేమో గాని, అమ్ముడు పోయిన మాధ్యమాల బానిసలుగా మిగిలిపోతారు. అటువంటి స్థితి వస్తుందేమో తస్మాత్ జాగ్రత్త. చట్టవ్యతిరేకమైనదంతా చట్టబద్ధమైనదిగా కనబడేలా చేసేందుకు చట్టాల పేరు మీద ప్రజల హక్కులు కొల్లగొట్టబడుతున్నాయి.

ఈ క్షణాన, నా భవిష్యత్తు అనిశ్చితం. కచ్చితంగా ఉన్నదొకే ఒకటి, ఆశ.

(హిందీ నుంచి ఇంగ్లిష్: రక్షా కుమార్, ఇంగ్లిష్ నుంచి తెలుగు: ఎన్ వేణుగోపాల్)

************************

కోడిపందాల స్థావరాలపై దాడులు… సి.ఐ భీమరాజు నేతృత్వంలో సిబ్బంది కోడిపందాలు, పేకాట స్థావరాలపై దాడులు చేశారు, తిరువూరు మండల పరిధిలోనీ మల్లెల గ్రామంలో పేకాట ఆడుతున్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి, 2500 రూపాయలు సీజ్ చేశారు. విస్సన్నపేట స్టేషన్ పరిధిలో తెల్లదేవరపల్లి గ్రామంలో కోడిపందాలు ఆడుతున్న 10 మందిని పట్టుకుని 12,800 రూపాయలు, 3 కోళ్లుని స్వాధీనం చేసుకున్నారు, ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, వారిపై సస్పెక్ట్ సీట్లు ఓపెన్ చేస్తామని సీ.ఐ భీమరాజు హెచ్చరించారు.